ఫ్యాన్స్‌ని క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న బాల‌కృష్ణ‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో బాల‌య్య అభిమానుల్ని ఇంకా క‌న్‌ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు. బ‌యోపిక్‌ని తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టిన‌ట్టు కనిపించిన బాల‌కృష్ణ‌.. మరోవైపు సైలెంట్‌గా ఆ ప‌నుల్ని కొంచెం కొంచెం చ‌క్క‌బెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈమ‌ధ్య విద్యాబాల‌న్‌ని క‌లిసి… బ‌స‌వ‌తార‌కం పాత్ర‌ని నేరేట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కొంత‌మంది న‌టీన‌టుల్ని ఎంపిక చేసి, వాళ్ల‌ని ఫోన్‌లోనే క‌థ చెప్పేశాడ‌ట బాల‌య్య‌. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఆయ‌న ఇంకా స్ప‌ష్టం చేయ‌డం లేదు. బాల‌య్య మైండ్‌లో ఇంకా క్రిష్ పేరే ఉంద‌ని, మరోవైపు బాల‌య్య క్రిష్‌తోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ని, ఒక‌వేళ క్రిష్ కాదంటే…. అప్పుడు తానే రంగంలోకి దిగాల‌ని భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ బయోపిక్ మొద‌లెడితే గ‌నుక‌.. 2019 మార్చిలోగా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఓ వైపు వినాయ‌క్ సినిమా చేస్తూ.. మార్చిలోగా బ‌యోపిక్ పూర్తి చేయ‌డం చాలా క‌ష్టం. అంత‌గా కావాల‌నుకుంటే వినాయ‌క్ సినిమాకి మ‌ధ్య‌లోనే ఆపి.. ముందు బ‌యోపిక్ పూర్తి చేస్తాన‌ని చెబుతున్నాడ‌ట‌. అందుకే సి.క‌ల్యాణ్‌, వినాయ‌క్ లు కూడా సిద్ధంగానే ఉన్నార‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

HOT NEWS

css.php
[X] Close
[X] Close