రాజకీయ బలప్రదర్శనలు లేనట్లే..! సింపుల్‌గా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్..!

వైరస్ రాజకీయ నేతల బలప్రదర్శనకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పుడల్లా.. అట్టహాసంగా కార్యక్రమాలు చేసుకోవడం సాధ్యం కాదని తేలిపోవడంతో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్.. సాదా సీదాగా బాధ్యతలు చేపట్టారు. నిజానికి ఆయనను నెలన్నర కిందటే.. బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా ప్రకటించింది. మంచి రోజు చూసుకుని.. బలప్రదర్శన చేసి… ధూం..ధాంగా బాధ్యతలు చేపట్టాలని ఆయన అనుకున్నారు. అయితే.. ఈ లోపే వైరస్ ముంచుకొచ్చింది. లాక్‌డౌన్ ప్రకటించడం.. కరోనా వ్యాప్తి ఇప్పుడల్లా తగ్గేలా లేకపోవడంతో… బహిరంగ కార్యక్రమాలు… జనం గుమికూడే వ్యవహారాలు నిర్వహించడం ఇప్పుడల్లా సాధ్యం కాదని క్లారిటీ వచ్చేసింది.

అందుకే ధూం..ధాంగా పదవీ బాధ్యతలు చేపట్టాలనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుని… సాదాసీదాగా బాధ్యతలు చేపట్టేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్‌లో… బీజేపీ ఆఫీసుకు రాదగినంత దగ్గరలో ఉన్న వారి సమక్షంలో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బండి సంజయ్ ను అధ్యక్షుడిగా ప్రకటించిన తరవాత అప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ సైలెంటయిపోయారు. రోజువారీ వ్యవహారాలకు సంతకం కూడా పెట్టే పరిస్థితి లేకపోవడంతో పలు పనులు ఆగిపోయాయి. దీంతో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

ఇప్పటికే బండి సంజయ్… అధికార పార్టీ మీద దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు కురిపిస్తున్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ కార్యాలయంలో దీక్ష కూడా చేశారు. ఆయనపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా విరుచుకుపడుతున్నారు. కరీంనగర్ నుంచి.. టీఆర్ఎస్‌ను ఓడించి… హిందూత్వ ఫేస్‌గా గుర్తింపు తెచ్చుకున్న బండి సంజయ్.. తెలంగాణలో పార్టీని … సరైన దారిలో తీసుకెళ్తారని.. సీనియర్లు కూడా నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close