దళిత బంధుపై కాంగ్రెస్‌లో గందరగోళం – కేసీఆర్‌తో మరోసారి భేటీకి భట్టి !

దళిత బంధు పథకంపై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అది ఓట్ల పథకం మాత్రమేనని మండిపడుతున్నారు. అయితే ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పథకం విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. పైగా ముఖ్యమంత్రి నుంచి ఈ పథకం విషయంలో ఆహ్వానాలు వస్తే ఏ మాత్రం తడుముకోకుండా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మొదటి సారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మరోసారి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తాజాగా నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేస్తున్నారు.

అందులో భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. దీంతో వెళ్లాలా వద్దా .. అని తర్జన భర్జన పడిన భట్టి విక్రమార్క చివరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన ఇంటికి టీ కాంగ్రెస్ ముఖ్యుల్ని ఆహ్వానించి చర్చించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా పేరు పొందినవారంతా హాజరయ్యారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి కూడా వచ్చారు. అదే సమయంలో టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ కూడా వచ్చారు. ఇటీవల మధుయాష్కీ కోమటిరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లుగా చాలెంజ్ చేశారు.

ఈ సమావేశంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ చివరికి భట్టి విక్రమార్క మాత్రం సీఎంతో సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దళిత బంధు పథకమేపెద్ద మోసమని వాదిస్తున్న కాంగ్రెస్ .. ఆ పథకం అమలు విషయంలో జరుగుతున్న సమావేశా లకు వెళ్లడం ఎందుకన్న వాదన సహజంగానేవస్తుంది. ఈ గందరగోళాన్ని కాంగ్రెస్ నేతలే పెంచుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close