తెలంగాణ “అవినీతి” పై ప్లాన్డ్‌గా గురి పెడుతున్న బీజేపీ !

తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ కమిటీలు, దర్యాప్తు అధికారుల్ని నియమిస్తోంది. ఆ అధికారం ఉందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ భారీగా అవినీతి జరిగిందని అనుమానం చోట్ల విచారణకు ఇప్పటి వరకూ అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని ఏదో విధంగా తొలగించుకుని విచారణ దారులు సృష్టించుకుంటోంది కేంద్రం. అందులో భాగంగానే తాజాగా మిషన్ భగీరథ అంశంలో అవినీతి జరిగిందని నిర్ధారించుకోవడం. ఇప్పటికే ధాన్యం అవకతవకల్లో ఎఫ్‌సీఐ విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా అవినీతి జరిగిందని ఇప్పటికే తేల్చారు. ఇక తర్వాత ప్రాజెక్టుల మీదకు రావొచ్చు. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి.

మిషన్ భగీరథ అయినా ప్రాజెక్టుల్లో అవినీతి అయినా.. ధాన్యం అవకతవకలైనా విచారణ జరిపే అధికారం కేంద్రానికి లేదు. మిషన్ భగీరథ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఖర్చు. కేంద్ర నిధులు ఉంటే విచారణ చేయించడానికి అవకాశం ఉండేది.కేసీఆర్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. కాళేశ్వరం లాంటిప్రాజెక్టు కూడా అంతే . కేంద్రం రూపాయి ఇవ్వలేదు. నిజానికి ఈ రెండింటికి ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది.కానీ పైసా ఇవ్వలేదు. ఒక వేళ ఇచ్చి ఉంటే.. తాము ఇచ్చిన నిధులు అవినీతి పాలయ్యాయని సీబీఐ విచారణ జరిపించేవారేమో. ధాన్యం సేకరణ అయినా అంతే. ఎఫ్‌సీఐకి చర్యలు తీసుకునే అధికారం లేదు.

అయినా ఇప్పుడు వివిధ మార్గాల ద్వారా విచారణ అవకాశాల్ని బీజేపీ సృష్టించుకుంటోంది. బక్కా జడ్సన్ అనే వ్యక్తి లేఖ రాశారని మిషన్ భగీరధపై విచారణాధికారిని నియమించింది. ప్రాజెక్టుల్లో అవినీతిని కాంట్రాక్ట్ సంస్థలపై ఐటీ దాడుల ద్వారా బయటకు తీయడానికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయింది. దాన్యం అవకతవకలపై సీబీఐ విచారణకూ మార్గం సుగమం చేసుకుంది. ఇక కేసీఆర్‌ను ఎప్పుడు కార్నర్ చేయాలంటే అప్పుడు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. దానికోసమే గ్రౌండ్ పిపరేషన్లని తెలంగాణ రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close