పవన్‌ను కన్ఫ్యూజ్ చేయడానికే బీజేపీ పొత్తు చర్చలు ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణలో బీజేపీ నిర్వహించిన పొత్తు చర్చలు కేవలం ఆయనను కన్ఫ్యూజ్ చేయడానికేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తో ఓ సారి కిషన్ రెడ్డి లక్ష్మణ్ సమావేశం అయ్యారు. తర్వాత ఆయనను తీసుకుని ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో అరగంట పాటు సమావేశం అయ్యారు. కానీ పవన్ కు పొత్తుల్లో ఇచ్చే సీట్ల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం తదుపరి చర్చల కోసం ఏదైనా ఓ ప్రక్రియ ఉంటుందా అన్నది కూడా చెప్పలేదు.

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం కొణిదెల కుటుంబం అంతా ఇటలీ వెళ్లింది. పవన్ కల్యాణ్ కూడా వెళ్లారు. ఆయన కుటుంబ కార్యక్రమం కోసం విదేశాలకు వెళ్తున్నారని తెలిసిన తర్వాత కూడా బీజేపీ నేతలు ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. దీంతో పొత్తుల విషయంలో బీజేపీ సీరియస్ గా లేదని.. కేవలం పవన్ కల్యాణ్ గందరగోళానికి గురి చేయడానికే కొత్తగా చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్నారన్న అనుమానాలు జనసేనలో వ్యక్తమవుతున్నాయి.

జనసేన 32 స్థానాల్లో పోటీ చే్యాలని అనుకుంది. ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఇప్పటికే పేర్లు కూడా రెడీ చేసుకున్నారు. కానీ బీజేపీ చర్చల పేరుతో పిలిచి.. అసలు ఇచ్చే స్థానాల గురించి చెప్పకుండా.. ఐదు నుంచి పన్నెండు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. మరో వైపు తమ పార్టీ పొత్తులు ఏపీలో ప్రభావం చూపకూడదని పవన్ కూడా అనుకుంటున్నారు. అసలు బీజేపీతో కలిసి పోటీ చేయాలని పవన్ ఎప్పుడూ అనుకోలేదు. కానీ హఠాత్తుగా బీజేపీ నేతలే పవన్ పై ఒత్తిడి ప్రారంభించారు.

బీజేపీ అసలైన రాజకీయాలు చేయకుండా.. మిత్రపక్షాలను సైతం..తప్పుడు పద్దతిలో డీల్ చేస్తోందన్న విమర్శలు చాలా కాలంగా ఎదుర్కొంటోంది. ఇప్పుడు జనసేన విషయంలోనూ అదే చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close