రెండేళ్లలో చంద్రబాబు జైలుకు..! ప్లాన్ బయటపెట్టిన కీలక నేత..!

ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్‌గా ఉందో … ఆపరేషన్ కూడా అంతే స్మార్ట్ గా.. నిర్వహిస్తున్నట్లుగా.. తరచూ బీజేపీ నేతల వ్యాఖ్యలతో బయట పడుతూనే ఉంది. ఇప్పటికి టీడీపీ నేతలను.. తమ పార్టీలో కలుపుకుంటున్న బీజేపీ.. త్వరలో.. చంద్రబాబును జైలుకు పంపాలనే వ్యూహరచన చేసినట్లుగా… ఢిల్లీలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ ధియోధర్.. బహిరంగంగా ప్రకటించి కలకలం రేపారు. కృష్ణా జిల్లాలో.. పురందేశ్వరితో కలిసి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… యథాలాపంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరన్న అంచనాలు మాత్రం రాజకీయవర్గాల్లో ఉన్నాయి.

ఏపీని త్రిపుర చేసినట్లుగా చేస్తామని.. అక్కడ లాగా ఇక్కడ కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని.. బీజేపీ నేతలు అదే పనిగా చెబుతున్నారు. త్రిపుర విషయంలో బీజేపీ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం.. సునీల్ ధియోధర్. కొన్నాళ్ల క్రితం సునీల్‌ని బీజేపీ కో ఇన్చార్జ్ గా నియమించారు. మురళీధరన్ అనే ఇంకో నేతను ఇన్చార్జ్ గా నియమించింది. ఇప్పుడు ఈ మురళీధరన్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. దీంతో సునీల్ ప్రధాన ఇన్‌చార్జ్ అయిపోయారు. సునీల్ దియోదర్ నరేంద్రమోడీకి సన్నిహితుడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి వారణాసిలో ఎన్నికల మేనేజర్‌గా పని చేశారు. ఈ ఆరెస్సెస్ నేతను గుజరాత్‌లోనూ ఉపయోగించుకున్నారు మోడీ. 2013లో దక్షిణ డిల్లీకి ఇంచార్జ్‌గా ఉన్నారు. 2014లో మహారాష్ట్రలో పని చేశారు.

త్రిపురలో ఉండేది పాతిక లక్షల మంది ఓటర్లు. అక్కడ యాభై వేల మందికిపై ఫుల్ టైమర్లను దింపి.. ఆరు నెలల ముందు నుంచి కార్యాచరణ రెడీ చేసుకున్నారు. ఏపీలో ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు రెడీ చేసి.. రాజకీయంగా అనుకున్నది సాధించడానికి భారతీయ జనతా పార్టీ.. సునీల్‌ని దింపిందనే విషయం అందరికీ అర్థమైపోయింది. టీడీపీ విషయంలో ఓ ప్రణాళిక ప్రకారం.. బీజేపీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లలో చంద్రబాబును జైలుకు పంపేనాటికి టీడీపీని నిర్వీర్యం చేయాలనే ప్లాన్ కూడా.. ఉండే ఉంటుందని… రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. మొత్తానికి బీజేపీ నేతల స్టేట్‌మెంట్లు.. తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close