ఆ లెక్కన రాజాసింగ్‌కు ఎన్ని శిక్షలు పడాలో..!?

బీఫ్ ఫెస్టివల్ విషయంలో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. వివాదాస్పద ప్రకటనకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజాసింగ్‌ చేసిన అనేకానేక కేసు పెట్టగలిగిన వ్యాఖ్యల్లో… బీఫ్ ఫెస్టివల్‌పై చేసిన వ్యాఖ్యలు ఒకటి. ఇప్పటికీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అయితే శిక్ష పడుతుందని రాజాసింగ్ కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే… తాను చాలా సందర్భాల్లో అంత కన్నా ఘాటు వ్యాఖ్యలే మాట్లాడానని ఆయనకుతెలుసు. ఇప్పుడు పైకోర్టులోఅప్పీల్ చేసుకునేందుకు కింది కోర్టు నెల గడువు ఇచ్చినా… హైకోర్టులో ఊరట వచ్చినా… శిక్ష మాత్రం పడినట్లే.

ఒక వేళ హైకోర్టు శిక్ష ఖరారు చేసినా రాజాసింగ్‌కు రాజకీయంగా వచ్చే నష్టం ఉండదు. ఆయనపై అనర్హతా వేటు పడదు. చట్టం ప్రకారం…రెండేళ్ల జైలు శిక్షపడితేనే ప్రజాప్రతినిధిపై అనర్హతా వేటు పడుతుంది. కానీ రాజాసింగ్‌పై వచ్చిన తీర్పు రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశం కావడం ఖాయం. ప్రజల్ని రెచ్చగొట్టేలా చేసే రాజకీయాల్లో ఈ మాటలదే కీలకం. ఇటీవల ఓ బీజేపీ నేత తిరుపతి ఉపఎన్నికలను కృష్ణుడు, ఏసుకు మధ్య పోటీగా అభివర్ణించారు. మామూలుగా అయితే ఇది రాజ్యాంగాన్ని ఘోరంగా అవమానించినంత నేరం. కానీ వారు దేశంలోని అధికార పార్టీ వారు.. వారి రాజకీయ విధానమే ఆ కోణంలో ఉంటుంది కాబట్టి… ఎవరూకేసుల వరకూ వెళ్లలేదు.

కానీ విద్వేష రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించాలంటే.. రాజాసింగ్‌కు విధించిన శిక్షతరహాలోనే అన్ని రాజకీయ పార్టీల నేతలకు వేయాలి. ప్రజాసమస్యలు మాత్రమే ఎన్నికల్లో చర్చనీయాంశం కావాలి కానీ.. కులం, మతం కాకుండా ఉండాలి. అలాంటి పరిస్థితి వస్తుందో లేదో చెప్పలేం కానీ… శిక్ష పడిన రాజాసింగ్‌లో కొంత మార్పు వచ్చినా ఆశలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close