గ్రేటర్ ఎన్నికల్లో పవన్ వల్లే గెలిచాం : ఎంపీ లక్ష్మణ్

గ్రేటర్ ఎన్నిక్లలో పవన్ స్ట్రాటజీ వల్లే గెలియామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గొప్పగా చెప్పారు. నిజామా అని జనసేన నేతలు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే.. గ్రేటర్ ఎన్నికలు ముగియగానే పవన్ కల్యాణ్ ఎవరు అంటూ … నిజామాబాద్ ఎంపీ అర్వింద్ లాంటి వాళ్లు ఎగతాళి చేశారు. బండి సంజయ్ కూడా అంతే. అందుకే పవన్ కల్యాణ్ ఆ తర్వాత తెలంగాణ బీజేపీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లోనూ పోటీ చేశారు. గౌరవం లేని చోట పొత్తులు ఉండబోవని ప్రకటించారు కూడా.

అయితే హఠాత్తుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు పవన్ జపం చేస్తున్నారు. పవన్ వల్లే గెలిచామని చెప్పడంతో పాటు… పవన్ కల్యాణ్ తమ కోసం ప్రచారం చేస్తారని చెబుతున్నారు. తమ భాగస్వామి పార్టీ జనసేన అని లక్ష్మణ్ అంటున్నారు. జనసేన పార్టీకి ఏఏ సీట్లు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. గ్రేటర్ పరిధిలో సీట్లు ఇవ్వొద్దని ముఖ్య నేతలు ఒత్తిడి చేస్తూండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి వస్తుందని, అయితే, రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా దేశ ప్రయోజనాలు సైతం చూస్తామని చెప్పుకొచ్చారు.

మరో వైపు టీడీపీతో పొత్తుపై అడిగితే లక్ష్మణ్.. తమ పార్టీ కేవలం జనసేనతోనే పోటీ చేస్తోందన్నారు. టీడీపీ ఎందుకు ఎన్నికల నుంచి విరమించుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పటివరకూ కాంగ్రెస్ కు మద్దతిస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. టీడీపీ పోటీ నుంచి విరమించుకుంటే.. బీజేపీకే మేలు అని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ బయట జరుగుతున్న ప్రచారం మాత్రం వేరేలా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close