టీఆర్ఎస్‌కు పీకేసి వైసీపీకి పదవులు.. బీజేపీ తేల్చేసుకుంది !

తమకు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో బీజేపీ తేల్చుసుకుంది. గల్లీ స్థాయి రాజకీయాల్ని పక్కన పెడితే ఢిల్లీలో కూడా ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవుల ద్వారా స్పష్టత ఇచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ పదవిని ఇచ్చారు ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్. అయితే గతంలో వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు కూడా ఆయనకు అవకాశం వచ్చింది. ఇప్పుడూ వచ్చింది. అంటే బీజేపీతో సంబంధాల్లో మార్పు రాలేదన్నమాట.

కానీ ఇప్పుడు వచ్ిచన అసలు మార్పు.. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న రెండు పార్లమెంటరీ స్టాండింక్ కమిటీ చైర్మన్ల పదవులు గల్లతు కావడం. ఇటీవలి కాలం వరకూ కేశవరావు , నామా నాగేశ్వరావు పరిశ్రమలశాఖ , లైబ్రరీ కమిటీ చైర్మన్లుగా ఉన్నారు. ఇక ముందు వారు చైర్మన్లుగా వ్యవహరించరు. ఆ పదవులు ఇతర ఎంపీలకు ఇచ్చారు. వారిని కేవలం మెంబర్స్ గా నియమించారు. 16మంది ఎంపీలున్న టిఆర్ఎస్‌కు స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి దక్కలేదు. ఇంతకు ముందు రెండు చైర్మన్ పదవులు ఇచ్చి.. ఇప్పుడు అసలేమీ ఇవ్వకపోవడం విజయసాయిరెడ్డికి పదవి ఇవ్వడంతో .. బీజేపీ విధానాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

ఢిల్లీలో మొదట్లో టీఆర్ఎస్ కాస్త సానూకలంగానే ఉండేది. రైతు చట్టాలు సహా అన్నింటికీ మద్దతు పలికింది. తర్వాత రాజకీయం మారిపోయింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ కారమంగా వారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టులకు దూరం పెట్టినట్లుగా భావిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం బీజేపీతో ఎలాంటి లొల్లి పెట్టుకోలేదు.. కనీసం రాష్ట్రానికి రావాల్సిన వాటిని కూడా అడగడం లేదు. అందుకే ఆ పార్టీకి చైర్మన్ పదవి మళ్లీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close