కర్ణాటక గుణపాఠాన్ని బీజేపీ నేర్చుకోదా ?

భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్ని చీల్చడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం లేదా.. ప్రభుత్వాన్ని మరింతం బలోపేతం చేసుకోవడం చేయడం రివర్స్ అవుతోంది. అది ఆ పార్టీపై ప్రజల్లో చులకన భావం తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయాలు తెచ్చి పెడుతోంది. అయినా ఆ పార్టీ మారడం లేదు.

మహారాష్ట్రలో ఎన్సీపీని నిలువుగా చీల్చేసింది బీజేపి. అజిత్ పవార్ పై ఈడీకేసులు.. ఇతర ఒత్తిళ్లు ఉన్నాయి. ఆయన అత్యధిక మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ పంచన చేరిపోయారు. అయితే ఇదంతా శరద్ పవార్ గేమ్ అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయినా సరే నింద అంతా బీజేపీపైనే పడనుంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి ఉంది. షిండేను తాము సీఎం చేయలేదని మహారాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్ని కల్లో .. మహా వికాస్ ఆఘాడికి ప్రజల మద్దతు ఉంటుందన్న సర్వేలు వస్తున్న సమయంలో ఎన్సీపీని చీల్చి బీజేపీ మరో తప్పు చేసినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఆపరేషన్ కమల్ ద్వారా కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రజల మద్దతు కోల్పోవడమే కాదు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అదే ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉన్నట్లయితే… కాంగ్రెస్, జేడీఎస్ … పై ఆ వ్యతిరేకత వచ్చి ఉండేది. బీజేపీ ఘన విజయం సాధించి ఉండేది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అంతే. మహా వికాస్ ఆఘాడి కూటమి జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీకి చాన్స్ ఉండేది.

ఇలా ప్రభుత్వాలను కూల్చడం.. చాణక్యం అని అమిత్ షాను… ఆ పార్టీ నేతలు పొగుడుతున్నారు. కానీ అది భస్మాసుర చాణక్యం అని ఇంకా గుర్తించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

కేసీఆర్ కు పెద్దపల్లి ఒక్క సీటుపైనే ఆశా..?

ఇటీవల పదేపదే పెద్దపల్లి సీటును గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారుతోంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 - 15 స్థానాలను గెలవబోతుందని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కేసీఆర్ ఇటీవల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close