వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్‌మెయిలింగ్ దందా కూడా !?

తెలంగాణలో పోలీసుల ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం ఒకటి అయితే బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కూడా నిఘా పెట్టి.. ట్యాపింగ్ చేసి వారి రహస్యాలు తెలుసుకుని బ్లాక్ మెయిలింగ్ దందా చేయడం కూడా జరిగిందని పోలీసుల వైపు నుంచి లీకులు వస్తున్నాయి. ఎవరైనా వ్యాపారులు ఫిర్యాదులు ఇచ్చారో లేదో స్పష్టత లేదు .. కానీ ఐటీ కారిడార్‌లో భారీగా భూములున్న సంధ్యా కన్వెన్షన్ ఓనర్ శ్రీధరరావు మాత్రం ఫిర్యాదు చేశారు.

గతంలో ఆయనపై చాలా కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకటి ఆయన స్వలింగసంపర్కుడని చేసిన ఆరోపణలతో పెట్టి కేసు కూడా ఉంది. ఇప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకా ఎవరైనా ట్యాపింగ్ పై పోలీసుల్ని ఆశ్రయించారో లేదో ఇంకా బయటకు రాలేదు. కానీ ఇలాంటి దందాలు జరిగాయని.. పెద్ద ఎత్తున పోలీసు అధికారులు ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు మాత్రం వస్తున్నాయి.

ఇప్పటికే ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తులు విదేశాలకు పారిపోయారు. వారిలో ముఖ్యుడు ప్రభాకర్ రావు అనే ఐపీఎస్ అధికారి. ఆయన కాంగ్రెస్ గెలిచిన రోజు సాయంత్రమే రాజీనామా చేశారు. తర్వాత అమెరికా పారిపోయారు. ఆయన తెలంగాణ పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి. మనం మనం పోలీసులం.. ఇళ్లల్లో సోదాలెందుకని అడిగినట్లుగా తెలుస్తోంది. ఏమైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా పంపించాలని ఆ అధికారి సమాధానం ఇచ్చారంటున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు అధికారులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారిని విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close