ఏపీ ఎన్నికలు : ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనగలరా ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనగలరా లేదా అన్నది తేల్చేసే ఎన్నికలుగా భావిస్తున్నారు. పరిపాలన పేరుతో ప్రజల్ని దోచుకుని ఎన్నికల సమయంలో వారికే ఆ డబ్బుల్లో కొంత భాగం ఇచ్చి ఓట్లు కొనే సరికొత్త ప్రజాస్వమ్య ప్రక్రియకు అధికార పార్టీ పూర్తి స్థాయిలో తెర తీసింది. ఈ మోడల్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందా అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఎవరికైనా ఓ విలువ కట్టే అధికార పార్టీ !

వారూ వీరు అని కాదు.. ఎవరికైనా ఓ విలువ కట్టేస్తుంది ఏపీ అధికార పార్టీ. గౌరవంగా తీసుకుని చెప్పినట్లుగా పని చేస్తే సరి లేకపోతే ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే చాలా మంది ఇచ్చింది తీసుకుంటున్నారు. కొంత మందికి ఏమమీ ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు అది వేరే విషయం. ఇక్కడా కొన్ని లెక్కలు ఉంటాయి. పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుంచి… చిట్ట చివరికి గ్రామ వాలంటీర్ల వరకూ అందరికీ డబ్బులు పంచేశారు. ఇక ఓటర్లకు పంచడమే మిగిలింది. వారికి ఎంత విలువ కడతారో తెలియాల్సి ఉంది.

అందుబాటులో లెక్క లేనంత నగదు !

నిజానికి నోట్ల రద్దు తర్వాత .. నోట్లు ఎక్కడికి పోతున్నాయో తెలుసుకునే వ్యవస్థ కేంద్రానికి ఉంది. కానీ ఏపీలో గత ఐదేళ్లుగా రెండు ప్రధాన వ్యాపారాలు పూర్తిగా నగదు రూపంలోనే నిర్వహిస్తున్నారు. ఒకటి మద్యం.. రెండు ఇసుక. ఈ రెండింటిలోనూ దేనికీ సరైన లెక్కలు ఉండవు. నగదు తీసుకోవడం వల్ల వారు చెప్పిందే ఆదాయం.. ఇచ్చిందే కలెక్షన్. ఇందులో నోట్లు కొన్ని వేల కోట్లు దారి మళ్లాయని అర్థంచేసుకోవచ్చు. ఆ డబ్బంతా ఇప్పుడు ఓట్లు కొనడానికి తెరపైకి వస్తోంది.

ప్రజాస్వామ్యం అమ్ముడైతే ఇక ఓటర్లే బాధితులు

ఓటుకు ఉన్న విలువ తెలియని వారు ఎంతో మంది ఉంటారు. వారిని రాజకీయ పార్టీలు అలా తయారు చేశాయి. డబ్బులు ఇవ్వకపోతే ఓటేయాలా అన్న ఆలోచనను తెచ్చాయి. ఆ రాజకీయ పార్టీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఒక్క ఆలోచన ఓటర్ చేస్తే.. రాజకీయం మారిపోతుంది. ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలాంటి ఆలోచన ఓటర్లకు ఎప్పుడు వస్తుందన్న దానిపైనే భవిష్యత్‌ పై ఆశలు ఉంటాయి. లేకపోతే ప్రజాస్వామ్యం పేరుతో నిలువు దోపిడీ చేసి.. పది రూపాయలు పంచుతున్న వారే పాలకులుగా మారుతూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close