టీటీడీ సభ్యుల్లో ఎంత మందిపై కేసులున్నాయి!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కిషన్ రెడ్డి సిఫార్సులో తెలంగాణకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తిని ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చి పదవి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నేరుగా కిషన్ రెడ్డి స్పందించారు. తన పేరు ఏమైనా అలాంటి సిఫార్సు లేఖలు వస్తే అవి నకిలీవని.. తాను కేంద్ర మంత్రిగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవర్నీ సిఫారసు చేయలేదని ఆయన స్వయంగా ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఇప్పుడీ అంశం సంచలనం అవుతోంది. బీజేపీ పెద్దల ఆశీస్సులు పొందేందుకు టీటీడీ బోర్డులో పదవుల కోసం ఆ పార్టీ నేతలు ఎవర్ని సిఫారసు చేసినా వారికి ఓ ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో పదవులు ఇచ్చేశారన్న అభిప్రాయం బలంగా ఉంది.

ముక్కూమొహం తెలియని వాళ్లందర్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. అయితే వారి గురించిన సమాచారం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. పలువురిపై కేసులు ఉన్నాయని.. అనేక మంది అక్రమాల్లో నిష్ణాతులు అన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి పదవుల్ని కూడా ఇలా ఫేక్ లెటర్లతో పొందారన్న ఆరోపణలు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా శ్రీవారి పాలక మండికి ఎనభై మందితో జంబో కమిటీని నియమించడం వివాదాస్పదమవుతోంది.

అందులోనూ నేరగాళ్లను నియమించడం మరింత వివాదాస్పదం అవుతోంది. తమిళనాడు నుంచి నియమించిన కన్నయ్య అనే వ్యక్తిపై సీబీఐ కేసులు చాలా ఉన్నాయి. ఈ బోర్డుపై విమర్శలు అంతకంతూ పెరుగుతున్నాయి. భక్తుల మనోభావాలకు ముడిపెడ్డి రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తే ఈ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close