ఎన్నారైలు ఓట్లు వేయవచ్చు..!

విదేశాల్లో స్థిరపడిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా…దేశ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికి విదేశాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం.. ఈ సదుపాయాన్ని ఇప్పటికే కల్పిస్తోంది. తాజాగా… ఎన్నారైలు అందరికీ కల్పించాలని ఆలోచన చేస్తోంది. గతంలోనే కేంద్రం.. ద్వంద్వ పౌరసత్వ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. అ ప్రకారం.. విదేశాల్లో స్థిరపడి.. పరిమిత ప్రయోజనాల కోసం.. ఇండియన్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉండొచ్చు. ఈ ప్రకారం.. అలాంటి వారందరూ కూడా … భారత్‌లో ఓటు వేయడానికి అవకాశం లభించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా… ప్రవాస భారతీయులతో సమావేశం కాకుండా రారు.

ఆయనకు ప్రవాస భారతీయుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా… ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆలోచన కార్యచరణలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న విధానం కాబట్టి.. కాస్త విస్తృత స్థాయిలో అమలు చేస్తే సరిపోతుంది. అయితే దాని కోసం కొంత అధికారికంగా చేపట్టాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి… రెండు మూడు నెలల సమయం పడుతుంది. అది కూడా.. ఎంతో కాలం పట్టకపోవచ్చు. వచ్చే పార్లమెంట్ సమావేశాల కన్నా ముందే జరిగే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నాటికి.. ఎన్నారైలకూ ఓటు హక్కు కల్పించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

విదేశాల్లో భారతీయులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరూ.. ఓట్లు వేస్తే.. చాలా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యపోనవసరం లేదు. నిర్ణయాక స్థాయిలో వారి ఓట్లు ఉంటాయి. అదే సమయంలో.. తమ దేశ ప్రజాస్వామ్యంలో భాగం అయ్యామన్న సంతృప్తి వారికి దక్కుతుంది. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకపోతే… ఎన్నారైలకు ఓటు హక్కు.. వారి ఉన్న దేశం నుంచే వినియోగించుకునే అవకాశం లభించడం ఖాయంగా చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close