గాల్వన్ చైనాదేనా..? మంటలు రేపుతున్న మోడీ మాటలు..!

భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని..అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇప్పుడు.. ఇంటా బయటా విమర్శల పాలవుతోంది. ఈ ప్రకటనను..చైనా తనకు అనుకూలంగా మల్చుకుంది. స్వయంగా భారత ప్రధానమంత్రినే చైనా బలగాలు.. ఇండియా భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్పారని… అంటే.. ఏం జరిగిందో సులువుగా అర్థం చేసుకోవచ్చని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి… ప్రకటించారు. అసలు అక్కడేం జరిగిందో… ఆయన వివరిస్తూ.. ట్వీట్లు చేశారు. మోడీ ప్రకటన ఆధారంగా.. గాల్వన్ లోయ పూర్తిగా చైనా అధీనంలో ఉందని.. అది చైనాకు సొంతమని వాదించడం కూడా ప్రారంభించారు.

మోడీ ప్రకటన.. ఆ తర్వాత చైనా స్పందనతో.. దేశంలో కూడా గగ్గోలు రేగింది. మన భూభాగంలోకి చైనా వాళ్లు రాకపోతే… ఘర్షణ ఎలా జరిగింది.. ఇరవై మంది ఎందుకు అమరవీరులయ్యారో.. ప్రధాని చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోడీ తన ప్రకటన ద్వారా గాల్వన్ లోయను చైనాకు అప్పగించేశారని విమర్శలు గుప్పించారు. దీనిపై అమిత్ షా స్పందించారు. రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే..శివసేన కూడా..చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటనను.. కోట్ చేస్తూ.. మోడీ ప్రకటనపై విమర్శల వర్షం కురిపించింది. గాల్వన్ లోయ తమదే అంటున్న చైనా వాదనకు..మోడీ ప్రకటన బలం ఇచ్చినట్లయిందని..దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విమర్శలు ఇలా పెరిగిపోతూండటంతో కేంద్రం కూడా స్పందించింది. ప్రధాని ప్రకటనకు దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారంటూ..ఖండించింది. కానీ.. జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close