అమరావతి రాజధాని అక్కడి ప్రజలకూ ఇష్టం లేదా..?

ఆరు నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడని అమరావతి చుట్టూ రాజకీయం రాజుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతి పర్యటనతో వేడి ప్రారంభమయింది. ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభిస్తామని ప్రకటించింది. వైసీపీకి చెందిన కొంత మంది నేతలు.. చంద్రబాబును అడ్డుకుంటామని బయలుదేరారు. ఇవన్నీ ఓ ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా… తెలిసిపోతున్నా.. పోలీసులు ఎవరొస్తున్నారు.. ఏం తెస్తున్నారనేది.. లైట్ తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరిగేలా చూసి… రాజకీయ అలజడి రేపి.. అక్కడ రాజధానిగా… అమరావతి ఉండటం అక్కడి ప్రజలకే ఇష్టం లేదన్న వాదనను.. తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతల్లో బలపడుతున్నాయి. దానికి దశాబ్దాల కిందటి.. చెప్పులు, రాళ్ల వ్యూహాన్ని అమలు చేస్తున్నారంటున్నారు..

అమరావతిలో ఒక్క ఇటుక పడలేదని… అమరావతి సచివాలయంలో కూర్చుని మంత్రులు చెబుతూంటారు. పీపీఏల విషయంలో కేంద్రాన్ని ధిక్కరిస్తూ.. అమరావతిలో ఉన్న హైకోర్టులోనే పిటిషన్లు వేస్తూంటారు. పాలనా పరమైన జీవోలన్నీ.. అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ నుంచే వస్తూంటాయి. తొంభై శాతం పూర్తయిన భవనాలు.. కొల్లలుగా కనిపిస్తూంటాయి. అయినప్పటికీ.. అమరావతిలో ఏం లేదని చెప్పడానికే.. వైసీపీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో.. చంద్రబాబు పర్యటన… అక్కడ ఆరు నెలల కిందట వరకూ జరిగిన అభివృద్ధిని ప్రజల్లో చర్చకు పెడుతుందన్న ఉద్దేశంతోనే.. అలాంటి పరిస్థితి లేకుండా.. ముందస్తు అలజడి వ్యూహం రేపారన్న అభిప్రాయాలు కూడా.. ఇతర పార్టీల్లో వినిపిస్తున్నాయి.

అమరావతిని జగన్ దశలవారీగా చంపేస్తున్నారని… చంద్రబాబు వ్యాఖ్యానించడంలో కూడా.. లోతైన అర్థం ఉందంటున్నారు. ఓ సారి ముంపు.. మరో సారి ఖర్చు ఎక్కువ.. మరో సారి కులం పేరుతో.. రాజధానిపై.. ఎన్నిరకాల ముద్రలు వేయాలో.. అన్నీ ప్రస్తుత సర్కార్ వేసింది. ఈ క్రమంలో.. అక్కడి ప్రజల మధ్య చీలిక తెచ్చి… వారి కంటిని వారి వేలితోనే పొడిచే ప్రక్రియకు తెరతీశారన్న అభిప్రాయం.. టీడీపీలో వినిపిస్తోంది. అసలు కారణం ఏమిటో.. ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీతో తేలిపోతుందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close