హామీలు రాని హడావుడి

Telakapalli-Raviముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ వెనువెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయిలుదేరారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు చాలామందిని కలిశారు. వారందరికీ తాను చేసిన విజ్ఞప్తులను చెప్పారే గాని వారేం చెప్పారో మాత్రం నిర్దిష్ట హామీలు వెల్లడించలేదు. ఎందుకంటే అలాటివి దాదాపు రాలేదు. కొద్ది రోజుల కిందట నీతి ఆయోగ్‌ చైర్మన్‌ అరవింద్‌ పంగారియా విజయవాడలో ఆయనతో సమావేశమైనప్పుడే కేంద్రం విదిలింపులు స్వల్పంగా వుండబోతున్నాయని ముఖ్యమంత్రికి సమాచారం అందింది. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో రు.3000 కోట్లకు మించి ఎపికి వచ్చే అందే అవకాశం లేదని పంగారియా స్పష్టంగా చెప్పారు. దాంతోహుటాహుటిన బయిలుదేరి వెళ్లారు. అమరావతికి రు.4000 కోట్లు, పోలవరంకు రు.8,000 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి రు,13,799 కోట్లు కోరుతూ విజ్ఞప్తి పత్రాలుతీసుకెళ్లారు. పోలవరంకు ఇప్పటి వరకూ రు.2వేల కోట్లకు పైగా ఖర్చు చేసినందువల్ల వాటిని విడుదల చేయాలని కూడా ఆయన కోరారు. వీటితో పాటే కొత్త రైల్వే పథకాలపైన సూచనలు చేశారు.ఈ అంశాలన్నీ విశదంగానే చెప్పారు గాని కేంద్రం కేటాయింపులపైన హామీలిచ్చినట్టు మాత్రం చంద్రబాబు చెప్పలేదు. ప్రత్యేక హౌదా సమస్యపై నీతి అయోగ్‌ నివేదిక అందిందని చెప్పిన ప్రధాని నిజంగా అది సానుకూలంగా వుంటే సూచన చేసి వుండేవారు.అయితే అది అనుకూలంగా లేదని తెలిసిన తర్వాతే ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ గురించి అడిగారు గాని.అది వచ్చేది కాదని రాష్ట్ర ఆర్థిఖ శాఖ ఎప్పుడో నిర్ధారించుకుంది. విజయవాడ పర్యటనలోనూ ఇటీవల ఢిల్లీలో వివిధ సందర్బాలలోనూ ఆయోగ్‌ చైర్మన్‌ పంగారియా ఇది స్పష్టంగానే చెబుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ప్యాకేజీ కూడా ప్రకటించకపోతే దానిపైనా ఆశలు వదులుకోవలసిందే. అమరావతి విషయానికి వస్తే ఇచ్చిన వాటితో నిర్మాణాలు చేపట్టకుండా వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తున్నట్టు బిజెపి నేతలు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ శంకుస్థాపన ప్రకటించి వాయిదా వేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అయోమయానికి నిదర్శనమని వారంటున్నారు. కనుక పర్యటన ఫలితం.. ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close