పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు : పేర్ని నాని

చిరంజీవి తరపున ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటనలు చేయడం ఆపడం లేదు. గతంలో ఆన్ లైన్ టిక్కెట్లు ‌అమ్మాలని చిరంజీవే కోరానని ఆయన ప్రకటించారు. అయితే చిరంజీవి ఈ అంశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా చిరంజీవి తరపున పేర్ని నాని మరో ప్రకటన చేశారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని.. ఆయన విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని ప్రకటించుకుంటున్నారు. పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చిరంజీవి చెప్పారన్నారు. సినిమా నిర్మాతలతో మచిలీపట్నంలో సమావేశం అయిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

సినిమా ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలతో తమకు సంబంధం లేదని చెప్పడానికే నిర్మాతలు వచ్చారని పేర్ని నానిచెప్పుకున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ కొత్తదికాదని ఆ విధానానికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందన్నారు. టాలీవుడ్ సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ కిరాయి పార్టీని నడుపుతున్నారని మండిపడ్డారు. కిరాయికి పని చేసేదెవరో అందరికీ తెలుసన్నారు. రాజకీయ పార్టీని టెంట్ హౌస్‌గా అద్దెకిస్తూంటారని ఆరోపించారు. అయితే మీడియాతో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు మాత్రం బ్యాలెన్సుడ్‌గా స్పందించారు. సినీ పరిశ్రమ సున్నితమైనదని.. వివాదాల్లోకి లాగవద్దని కోరారు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచాలని కోరామని.. గత సమావేశంలోనూ కోరామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

పవన్ కల్యాణ్ ఓ వైపు మంగళగిరిలో పార్టీ సమావేశం పెట్టి ప్రభుత్వం, వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలోనే వ్యూహాత్మకంగా నిర్మాతల్ని మంత్రి పిలిపించుకున్నట్లుగా భావిస్తున్నారు. పవన్ సమావేశం జరుగుతున్న సమయంలో చిరంజీవి పేరుతో పేర్ని నాని ప్రకటన చేయడం … సినీ పరిశ్రమ పవన్ వైపు లేదని చెప్పడానికి ప్రయత్నించడం వ్యూహం ప్రకారం చేస్తున్నారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close