మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పై చిరంజీవి ప్రశంసలు జల్లు

మెగాస్టార్ చిరంజీవి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాలోని నీలకంఠ పురం లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయాల ప్రారంభోత్సవానికి కరోనా కారణంగా హాజరు కాలేకపోతున్న చిరంజీవి వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు.

చిరంజీవి ఈ వీడియో సందేశంలో మాట్లాడుతూ, “నా రాజకీయ ప్రస్థానం లో నాకు లభించిన గొప్ప స్నేహితులు రఘువీరారెడ్డి . పరిచయం అయిన తక్కువ సమయంలోనే ఆయన నాకు అంత ఆప్తులు కావడానికి కారణం ఆయన ఉన్నత వ్యక్తిత్వం, సామాన్యుల పట్ల ఆయనకు ఉండే ప్రేమ, దానితో పాటు నా పై ఆయన చూపించే వాత్సల్యత. ప్రజా జీవితంలో రఘు వీరారెడ్డి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అని నా స్వానుభవం. నేను నటించిన ఇంద్ర సినిమాలో నా పాత్ర కరువు రాయల సీమకు నీళ్లు ఇవ్వాలని తపన పడితే, నిజ జీవితం లో ఆ కరువు సీమకు నీళ్లు ఇచ్చి రఘువీరా రియల్ హీరో అయ్యారు. దాహం అంటూ అలమటిస్తున్న రాయలసీమకు నీళ్లు ఇవ్వడం ద్వారా తనను నాయకుని చేసిన ప్రజల రుణాన్ని ఆయన తీర్చుకున్నారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావడం మహద్భాగ్యం. ప్రస్తుతం మా రాజకీయ స్తబ్దత లో నేను సినిమాలు తీస్తూ సినీ నటుడిగా కాలం వెళ్లదీస్తుంటే, రఘువీరా రైతుగా అవతారమెత్తి , వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ఆలయాలు పునర్నిర్మించడానికీ, కొత్త ఆలయాలు నిర్మించడానికి పాటుపడుతున్నారు. ఆయన కి ప్రజల సహకారంతో పాటు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా రఘువీరా రెడ్డి చేస్తున్న కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుండి అభినందనలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close