మార్గదర్శి కేసు : సీఐడీ నవ్వుల పాలయ్యే మరో విన్యాసం

చిట్స్ వేసి పాడుకుని.. డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన వారిని తీసుకొచ్చి.. మార్గదర్శి మోసం చేసిందని కేసులు పెట్టిస్తున్నారు సీఐడీ అధికారులు. ఇలాగే గతంలో ఓ సారి తప్పుడు ఫిర్యాదు తీసుకుని … విజయవాడ పోలీస్ కమిషనర్ ఏకంగా తన ఆఫీసులోనే ఫిర్యాదు దారుడ్ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ కోర్టు ఇచ్చిన షాక్ తో మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు సీఐడీ అదే పని చేసింది. ఓ మహిళను తీసుకొచ్చి ఆమె ఫిర్యాదు చేసిందని చెప్పి కేసు పెట్టారు. ఆమె ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు చూస్తే.. మార్గదర్శిది తప్పేమీ లేదని.. అందరికీ అర్థమవుతుంది. సీఐడీ కుట్ర చేస్తోదని ఆమె మాటలు విన్న వారికి అర్థమవుతుంది.

అన్న పూర్ణ అనే మహిళ పౌల్ట్రీ ఫాం వ్యాపారం చేస్తున్నారు. ఆమె మొదట తన ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా చిట్స్ వేశారు. తర్వాత ఇష్టం వచ్చినట్లుగా చిట్స్ వేశారు. కడతానని చెప్పి కనీసం 90 చిట్స్ వేశారు. ఈ విషయం ఆమె చెప్పారు. డబ్బులు కట్టలేక 17 చిట్స్ లో డీఫాల్ట్ అయ్యారు. చిట్స్ పాడుకున్న తర్వాత ష్యూరిటీలు ఇచ్చి నగదు తీసుకున్నారు. కానీ కట్టడం మానేశారు. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి ఆమె చేతులెత్తేయడంతో ష్యూరిటీ సంతకాలు పెట్టిన వారి దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు. ఈ విషయాలు కూడా ఆమె చెప్పారు. ఇది తప్పెలా అవుతుందో సీఐడీ అధికారులు చెప్పాల్సి ఉంది.

ఆమె కుమార్తె సంతకాలు ఫోర్జరీ చేసి.. చిట్ పాడారని.. ఆమె విదేశాల్లో ఉందని ఇలాంటి కబుర్లు చెప్పారు. కేసులు పెట్టామన్నారు. ఆమె పూర్తిగా చిట్ వ్యవహారాల్లో డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన విషయం ఆమె చెబుతున్నప్పుడు .. మోసం చేసింది ఆమే అవుతుంది కానీ మార్గదర్శి ఎలా అవుతుందన్న చిన్న లాజిక్ సీఐడీ పోలీసులకు రాలేదు. ఏదో విధంగా తప్పుడు ప్రచారాలు చేయడానికి.. ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకు వస్తే వారికి రాచమర్యాదలు చేయడం కామన్ అయిపోయింది. ఇదే ప్రెస్మీట్ లో ఇంకా చాలా ఆరోపణలు చేశారు సీఐడీ సంజయ్. వాటిని ఎందుకు కోర్టు ముందు పెట్టలేకపోతున్నారో మాత్రం చెప్పలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close