జగన్ తో స్నేహానికి కాంగ్రెస్ సంకేతాలు ఇస్తోందా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టి పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న పసిపిల్లలను అడిగినా సరే.. టక్కున సమాధానం వచ్చేస్తుంది… ఆ పార్టీ సర్వనాశనం అయిపోయిందని! పూర్తిగా పతనం అయిపోయిన ఆ పార్టీ ఇప్పట్లో లేచి నిలబడడం కూడా సాధ్యం కాదని కూడా తమ అభిప్రాయం చెబుతారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ కి సంబంధించి నంత వరకు ఇక సొంత కాళ్ళ మీద లేచి నిలబడడం అనేది అసాధ్యం. అందుకే కాబోలు వైసీపీ తో స్నేహ బంధం కోసం వారు ఇప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ఎటొచ్ఛీ ఉన్న బలం కొద్ది కొద్దిగా కోల్పోతున్నది గనుక.. ఈ సమయంలో తాము స్నేహహస్తం చూపితే అంగీకరించవ్చచునని బహుశా వారి ఆలోచన కావచ్చు.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో ఆ పార్టీ నాయకులకు పూర్తి క్లారిటీ ఉంది. కనీసం తమ ఉనికి కాపాడుకోవాలంటే… ఎక్కువ కష్టపదాలని వారికీ తెలుసు. అందుకే వైసీపీ వదిలేసిన, టీడీపీ సీరియస్ గా పట్టించుకోని ప్రత్యెక హోదా గురించి ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి తాము సేకరించాం అని చెబుతున్న కోటి సంతకాలను పార్టీ పెద్దల చేతిలో పెట్టి వచ్చారు. అయితే ఢిల్లీ లో కేవలం సోనియా తో సమర్పణ పర్వం కాకుండా మరొక కీలక పరిణామం కూడా జరిగింది.

ఏపీ కాంగ్రెస్ నాయకులతో , రాహుల్ విడిగా సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించారు. బహుశా ఆ భేటీలో అయన జగన్ తో సత్సంబంధాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇవాళ తాజాగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేసే ఏ పార్టీ పొరడినా వెనక ఉంది మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో టీడీపీ, బీజేపీ లు ప్రభుత్వం నడుపుతున్నాయి గనుక.. వారు పోరాడటం భ్రమ. సానుకూలంగా సాధించాలి అని వారు అంటూనే ఉన్నారు. ఇక అంతో ఇంతో పోరాటం అనే మార్గం నమ్ముకుని ఉన్నది వైసీపీ మాత్రమే. ఈ పోకడను గమంచినప్పుడు, జగన్ తో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉండే.. కేవీపీ ఇప్పుడు అయన పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి, వైసీపీ తో కాంగ్రెస్ స్నేహ బంధానికి తపన పడుతున్నారేమో అనిపిస్తోంది. జగన్ కు ప్రస్తుతం వేరే గత్యంతరం లేకపోయినప్పటికీ వీరి పరోక్ష ప్రతిపాదనకు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close