కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను మార్చనుందా- కారణం అదేనా..?

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయా..? ఒకటి, రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఖాయమా..? సామాజిక వర్గం ఈక్వేషన్ తో పాటు ఓ ఎంపీ అభ్యర్థిపై ఏఐసీసీ గుర్రుగా ఉండటంతో మార్పులు,చేర్పులు తప్పవా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మాల, మాదిగ ఈక్వేషన్ తో గడ్డం వంశీని తప్పించి అక్కడి నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ఎంపికే చేసే అవకాశం ఉంది. తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాల్లో మాల సామాజిక వర్గ నేతలకే టికెట్లు ఇచ్చారు. దీనిపై మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పై గుర్రుగా ఉంది. ఇక, వరంగల్ నుంచి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరనుండటంతో ఆయనను బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మూడు లోక్ సభ సీట్లు మాల సామాజిక వర్గానికే దక్కినట్లు అవుతుందని.. అందుకే పెద్దపల్లి స్థానం మాదిగలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు టాక్.

పైగా..గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పై విమర్శలు వచ్చాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురికి టికెట్లు ఇస్తారా..? అని పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు లోక్ సభ పోరులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ తనయుడికి టికెట్ ఇవ్వడంపై పురాలోచించాలని పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే సామాజిక వర్గాల ఈక్వేషన్ లో భాగంగా గడ్డం వంశీని తప్పించాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి మాదిగ సామాజిక వర్గం నేతకు టికెట్ ఇచ్చి ఆ సామాజిక వర్గం నుంచి అసంతృప్తి లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు.

అదే సమయంలో సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ తో కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు డిమాండ్ చేస్తున్నా…ఇప్పుడు ఆయన బెట్టు చేస్తుండటంతో ఏఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం స్థానంలో అదే స్థానం నుంచి టికెట్ ఆశించిన బొంతు రామ్మోహన్ పేరును పార్టీ పరిశీలిస్తోందని టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close