జగన్ మినిస్టర్ ఆఫర్‌ను తిరస్కరించిన దగ్గుబాటి !

మాజీ మంత్రి దుగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసీపీ అధినేత జగన్ రెడ్డి అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపేశారని చాలా మందికి తెలుసు. అయితే అంతకు ముందు జరిగిన విషయాలను దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు ప్రజల ముందు ఉంచారు. చాలా రోజుల తర్వాతా ఆయన నియోజకవర్గంలో ఓ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జగన్ తనను పిలిచారని, తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు అన్నారు.

ఆయన పెట్టిన నిబంధనలకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. ఆయన పెట్టిన నిబంధనలు ఏమిటంటే.. పురందేశ్వరిని కూడా బీజేపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరడం. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండవద్దని.. వైసీపీలో చేరేలా పురందేశ్వరిని ఒప్పించాలని ఒత్తిడి చేశారు. అయితే దగ్గుబాటి మాత్రం తన కుమారుడికి ఎమ్మెల్సీ వద్దు.. మంత్రి పదవి వద్దు అని తిరస్కరించారు. ఎందుకంటే.. జగన్ రెడ్డి సంగతి ఆయనకు బాగా తెలుసు. అదే సమయంలో తాను పర్చూరులో ఓడిపోవడం మంచిదయిందన్నారు. అదే గెలిచి ఉంటే.. ఇప్పుడు పనులు చేయడం లేని ప్రజలు తన చొక్కా పట్టుకునేవారన్నారు.

కారంచేడులో రోడ్లు వేయలేదని ప్రజలు అంటున్నారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగలేకపోయేవాడినని అన్నారు. దేవుడి దయవల్ల పర్చూరులో తాను ఓడిపోవడమే మంచిదైందని చెప్పారు. దగ్గుబాటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close