భయపెడుతున్న దిల్ రాజు మాటలు

మహర్షి సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పారంటూ మహేష్ అభిమానుల మధ్య కొన్ని మాటలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతే కాదు, మహేష్ అభిమానులకు, మహేష్ వార్తలను ప్రచారం చేసే వెబ్ సైట్లలో కూడా దర్శనమిస్తున్నాయి. ఇంతకీ దిల్ రాజు ఏమన్నారు? వాటి వైనం ఏమిటి?

”..మహర్షి సినిమా అయిపోయి బయటకు వచ్చేవారు బరువైన హృదయంతో వస్తారు. మహేష్ పర్సనల్ లైఫ్ తో స్టోరీ కనెక్ట్ అయి వుంటుంది. స్నేహంలో వుండే ఎమోషన్, అమ్మనాన్నలతో వుండే ఎమోషన్, సౌసైటీతో వుండే ఎమోషన్, అసలు మహర్షి ఎవరు? ఎవరైనా మహర్షి ఎందుకు అవుతారు?” ఇలా వుంటుంది సినిమా అన్నారట దిల్ రాజు.

దీన్ని బట్టి చూస్తుంటే చాలా బరువైన కథనే తలకెత్తకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలకు రేటింగ్ లు, ప్రశంసలు వస్తాయి కానీ, పైసలు రావడం కష్టం అని గతంలో రుజువైన అంశం. వంశీ పైడిపల్లి ఊపిరి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్. దానికి ప్రశంసలు మాత్రమే మిగిలాయి. పైగా మళ్లీ పల్లెటూరు, వ్యవసాయం, లాభసాటి లాంటి వ్యవహారాలు మహర్షి ద్వితీయార్థం అంతా పరుచకున్నాయి అని టాక్.

ఇవన్నీ తెలుసుకుని, దిల్ రాజు మాటలు తెలుసుకుంటే సినిమా ఎలా వుంటుందో అనే దానికన్నా, ఎలా ఫేర్ చేస్తుందో అని అభిమానులు కలవరపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close