ఫాక్స్ స్టూడియో చేతిల్లోకి వెళ్లిన‌ ‘హిర‌ణ్య‌’

గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `హిర‌ణ్య‌`. గ‌త రెండేళ్ల నుంచీ ఈ స్క్రిప్టు ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోయారు గుణ‌శేఖ‌ర్‌. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించాల‌ని భావిస్తున్నారు. బ‌డ్జెట్ కూడా ఎక్కువే. దాదాపు 200 నుంచి 250 కోట్ల వ‌రకూ ఖ‌ర్చ‌వుతుంద‌ని ఓ అంచ‌నా. అయితే ఇంత భారీ బ‌డ్జెట్ సినిమా తీయ‌డానికి సురేష్ బాబుకి ధైర్యం చాల‌డం లేదు. దాన్ని తిరిగి రాబ‌ట్టుకోగ‌లిగే స‌త్తా రానాకి ఉందా, లేదా? అనే మీమాంస ఆయ‌న్ని లాగుతోంది. అయితే… ప్రాజెక్టుపై మ‌మ‌కారంతో ఆయ‌న రంగంలోకి దిగారు. బ‌డ్జెట్ విష‌యంలో రిస్క్ ఉంది కాబ‌ట్టి, ఇప్పుడీ సినిమాని ఓ అంత‌ర్జాతీయ సంస్థ చేతిలో పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

20 th ఫాక్స్ స్టూడియోతో అనుసంధాన‌మై ఈచిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు సురేష్ బాబు. ప్రొడ‌క్ష‌న్ మొత్తం సురేష్ బాబు చూసుకునేలా, పెట్టుబ‌డిలో కొంత భాగం ఫాక్స్ పెట్టేలా ఒప్పందాలు జ‌రిగాయ‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని హిందీలో క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ సెట‌ప్ మాత్రం ప‌టిష్టంగానే క‌నిపిస్తోంది. గుణ‌శేఖ‌ర్ కూడా ఈ స్క్రిప్టు విష‌య‌మై చాలా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. 2019 మార్చి లేదా ఏప్రిల్ లో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close