తేలిపోతున్న “సిట్” – దూకుడు పెంచుతున్న “ఈడీ” !

తెలంగాణ, కేంద్రం మధ్య సాగుతున్న దర్యాప్తు సంస్థల మధ్య పోరాటంలో సిట్ దర్యాప్తు అంతకంతకూ తేలిపోతోంది. కానీ ఈడీ మాత్రం స్టడీగా పని చేసుకుటూ పోతోంది., సిట్ ఇంత వరకూ తెలంగాణ బయట వ్యక్తుల్ని ఒక్కర్ని కూడా రప్పించి ప్రశ్నించలేకపోయింది. ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీచేసినా… ప్రయోజనం లేకపోయింది. అరెస్టులు చేస్తామని హడావుడి చేస్తోంది కానీ.. వారు వెంటనే కోర్టులకు వెళ్లి సిట్ తీరుపై అనుమానాలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో సిట్ ముందరి కాళ్లకు ఎప్పటికప్పుడు బంధాలు పడుతున్నాయి.

బీఎల్ సంతోష్‌కు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే స్టే ఉంది. తుషార్‌నూ అరెస్ట్ చేయవద్ది హైకోర్టు చెప్పింది. సీబీఐకి ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ విచారణలో ఉంది. సిట్ హైకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో… ఎక్కడై సరైన ఆధారాలు లేవు. వారు ఫలానా చోట కలిశారని చెబుతున్నారు కానీ.. నిర్దిష్టంగా… ఎమ్మెల్యేల కొనుగోలు కోసమే కలిశారని చెప్పే ఆధారాలను చూపించడం లేదు. అక్కడ వారు కలిస్తే నేరం ఏమిటన్నది ఎవరికైనా వచ్చే మౌలికమైన సందేహం. వాట్సాప్ చాట్‌లను.. కాల్ రికార్డులను చూపిస్తున్నారు. సెల్ లొకేషన్లను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన వాట్సాప్ చాట్‌లో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో కొన్ని సంభాషణలు ఉన్నాయి. దీంతో సిట్ విచారణ తీరు తేలిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.

మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాత్రం ఈడీ దూకుడుగా .. ప్రణాళికాబద్దంగా మందుకెళ్తోంది. అమిత్ అరోరా ను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఫోన్లు మార్చిన వైనం… ఇతర వ్యవహారాలు చేర్చారు. ఆర్థిక లావాదేవీల అంశాన్నీ ప్రస్తావించారు. శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలే ప్రధానం అని చెబుతున్నారు. ఇప్పుడ వారికి అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. ఈ స్కామ్‌ విచారణకు కౌంటర్‌గా సిట్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నా..సాధ్యం కావడం లేదు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులకు అధికారం సరిపోదన్న కారణంతో… హైకోర్టు సీబీఐకి ఇస్తే.. మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే… ఈ విచారణల్లో నెక్ట్స్ ఏం జరుగుతుందన్న ఆసక్తి అంతటా ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close