ఒక్క బొప్పరాజుదే పోరాటం.. మరి మిగతా వాళ్లు !?

ఏపీ ఉద్యోగ సంఘాల్లో ఒక్క బొప్పరాజు వెంకేటేశ్వర్లు నేతృత్వంలోని ఏపీజేఏసీ అమరావతి మాత్రమే ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కనీసం జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ కూడా సీఎస్ కు ఇచ్చి అమలు చేస్తున్నారు కూడా. ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు ఉన్నప్పటికీ… ప్రభుత్వంపై ఆయన పోరాడుతున్న తీరు మాత్రం ప్రత్యక్షంగానే ఉంది.

కానీ బొప్పరాజు తరహాలో ఇతర ఉద్యోగ సంఘ నేతలెవరూ స్పందించడం లేదు. ఎపీ ఎన్జీవో అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన బండి శ్రీనివాసరావు ఎప్పుడోఒకప్పుడు తీతాలిస్తున్నారు కదా సరిపోతుందిలే అన్నట్లుగా ఉన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల గురించి ఆయనేం మాట్లాడటం లేదు. ఇక సచివాలయ నేత వెంకట్రామిరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ప్రభుత్వమే ముఖ్యం. తనను ఎన్నుకున్న ఉద్యోగులు ఏమైపోయినా ఆయన పట్టించుకోరు. ఇక కేఆర్ సూర్యనారాయణ అనే మరో ఉద్యోగ సంఘం నేత ప్రకటనలు భీకరంగా ఉంటాయి కానీ… కార్యాచరణకు వచ్చే సరికి.. సైలెంట్ గా ఉంటారు.

ఉద్యోగులకు గతంలో ఎప్పుడూ జరగనంత నష్టం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగింది. అది ఆర్థిక నష్టాలే కాదు .. అవమానాలు కూడా., ఉద్యోగుల్ని ఒక్కరూ గౌరవంగా చూడటం లేదు. కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. ఎంతగా అవమానించాలంటే అంతగా అవమానిస్తున్నారు. డీఏలు ఇవ్వడం లేదు. పీఆర్సీ ఏర్పాటు చేయడం లేదు. అయినా ఉద్యోగ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. వీరంతా వ్యక్తిగత ప్రయోజనాలు పొంది లైట్ తీసుకుంటున్నారు. ఉద్యోగుల భవిష్మత్‌ను పణంగా పెడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close