సోమేష్ కుమార్ ఎకరం రూ. 2 లక్షలకే కొన్నారట!

తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిండా మునిగిపోతున్నారు. ఆయన ధరణి మాస్టర్ మైండ్. ఆ క్రమంలో ఆయన చేసిన దురాగతాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ ఆయన మాత్రం పాతిక ఎకరాలు కొనుగోలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారులో ఎకరం రెండు లక్షలు పెట్టి ఆయన ఏకంగా పాతిక ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి.

అడవిలో కూడా ఎకరం రెండు లక్షలు లేదని.. అలాంటిది హైదరాబాద్ శివారులో ఎలా ఉంటుందని.. ఇందులో గూడుపుఠాణి ఏమిటో బయటకు లాగాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సోమేష్ కమార్ నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు. పదిహేను మంది సీనియర్లు ఉన్నప్పటికీ అందర్నీ కాదని ఆయనకు సీఎస్ పోస్ట్ ఇచ్చారు కేసీఆర్. కోర్టు తీర్పు కారణంగా ఆయన ఏపీ సర్వీసుకు వెళ్లాల్సి వస్తే వెంటనే వీఆర్ఎస్ తీసుకుని సలహాదారుగా నియమితులయ్యారు. కొత్త సచివాలయంలో ఆయనకు విశాలమైన చాంబర్ ఉండేది. భూ వ్యవహారాలన్నీ ఆయనేచూస్తారని చెబుతారు. ఇప్పుడు ఈ భూముల లావాదేవీల వెనుక రహస్యాలన్నింటినీ వెలుగులోకి తెచ్చేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు.

వైట్ గా కట్టింది యాభై లక్షలు కావొచ్చు కానీ.. కోట్లకు కోట్లు బ్లాక్ మనీ కట్టి ఉంటారని ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందో వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇది సోమేష్ కుమార్ లీలల్లో .. ఒక్క శాతమేనని ఇంకా చాలా బయటకు వస్తాయని.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close