చివరకు పవన్‌పై కోర్టుకెళ్లడానికీ వాలంటీర్‌పైనే ఆధారపడ్డ ప్రభుత్వం !

పవన్ పై కోర్టుకెళ్లడానికి ఏకంగా జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.. తమ వల్ల కాదని.. చివరికి ఓ వాలంటర్ ను రంగంలోకి తెచ్చింది. విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ వాలంటీర్ తో పిటిషన్ వేయించారు. వాలంటీర్ ఇచ్చిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు. ఆ మహిళా వాలంటీర్.. తన పిటిషన్‌లో చాలా విషయాలు చెప్పారు. పవన్ కల్యాణ్‌ తమపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురయ్యారట. అందుకే న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారని చెప్పకొచ్చారు.

ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ తరపు న్యాయవాదులు. బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని.. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది.. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు కోర్టు నోటీసులు ఇస్తుందని ఆ లాయర్లు చెప్పుకున్నారు. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి.. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారు.. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని లాయర్లు చెప్పుకొచ్చారు.

ధైర్యంగా ప్రభుత్వం పవన్ పై పిటిషన్ వేయలేక వాలంటీర్ల వెనుక దాక్కుంటోందని జనసేన నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేయాలో తెలుసని.. హైకోర్టుకు కాకుండా.. కింది సివిల్ కోర్టులో .. వైసీపీ తరపున లాయర్లు చేసే రాజకీయం ఏమిటో మొత్తం తెలుసని జనసేన నాయకులంటున్నారు. ఈ విషయంలోనూ వలంటీర్లను బలి పశువుల్ని చేయడం ఎందుకని.. నేరుగా జగన్ రెడ్డే రావొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close