వరంగల్ ఉపఎన్నిక రిఫరెండమే: మొన్న కేటీఆర్, నేడు హరీష్

హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో ఖచ్చితంగా గెలిచి తీరుతామని టీఆర్ఎస్ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం తమ పార్టీ పాలనపై రిఫరెండమ్ అని మొన్న పంచాయతీ, ఐటీ శాఖలమంత్రి కేటీఆర్ ప్రకటించగా, తాజాగా నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావుకూడా అదే విధంగా వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ 500 రోజుల పరిపాలనపై 50 ప్రశ్నలు అంటూ కాంగ్రెస్ నిన్న విడుదల చేసిన పుస్తకంపై స్పందిస్తూ, ప్రతిపక్షనేతలు గ్రామాలలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడితేనే ప్రభుత్వం చేసిన కృషి తెలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉపయోగం లేదని చెప్పారు. ఈ ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తెలంగాణ వెనకబాటుతనానికి దశాబ్దాలపాటు జరిగిన కాంగ్రెస్ పరిపాలనే కారణమని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే తమ పార్టీకి తిరిగి ఓట్లు అడగబోనని బహిరంగంగా ప్రకటించిన నేత దేశం మొత్తంలో కేసీఆర్ తప్ప మరెవరూ లేరని అన్నారు. టీఆర్ఎస్ చేసిన ప్రతి వాగ్దానాన్ని అమల్లోకి తెస్తున్నదని చెప్పారు. ఎన్నికలముందు అద్భుతాలు చేస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చటం తమ పార్టీ చరిత్రలో లేదన్నారు.

సింగరేణి కార్మికులను, ఆర్టీసీ డిపో కార్మికులను, వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులను, అంగన్ వాడీ కార్యకర్తలను అడిగితే టీఆర్ఎస్ ఏమి చేసిందో, కేసీఆర్ ఏమి చేశారో చెబుతారని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. రు.20 వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close