బిగ్‌బాస్ అయిపోయింది.. ఇక హేమ వైసీపీలోకి..!

బిగ్‌బాస్ నుంచి వారంలోనే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందే.. తాను.. కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని.. రాజమండ్రిలో ఇల్లు కూడా కట్టుకుంటున్నానని ప్రకటించిన హేమ… బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే… దానికి సంబంధించిన కార్యచరణ ప్రారంభించారు. సోమవారం.. బిగ్‌బాస్ హౌస్‌లో తనకు అన్యాయం జరిగిందని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన.. హేమ.. మంగళవారం నేరుగా ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో తన రాజకీయ ఆకాంక్షలను వివరించారు.

జగన్‌ పార్టీ అంటే తనకు ఎంతో ఇష్టమని హేమ ప్రకటించుకున్నారు. ఎన్నికల సమయంలో.. జగన్‌ పార్టీలో జాయిన్‌ అవ్వలేదు కానీ సపోర్ట్‌ చేశానన్నారు. అయితే రాజకీయాల్లోకి వెళ్తున్నంత మాత్రాన సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లాలని అనుకోవడం లేదని … ఇండస్ట్రీలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. గతంలో ముద్రగడతో కలిసి.. హేమ కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో అప్పుడప్పుడూ పాల్గొన్నారు. తాజాగా.. ఈ అంశంపై జరుగుతున్న రచ్చ విషయంలో.. హేమ.. తాను చేరాలనుకుంటున్న పార్టీకి అండగా నిలిచారు. కాపు రిజర్వేషన్లపై ఎన్నికల ముందే జగన్‌ స్పష్టత ఇచ్చారని .. కాపు రిజర్వేషన్లపై జగన్‌ మాట మార్చడం లేదని సర్టిఫికెట్ ఇచ్చారు.

రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను ఎంత వరకు సమాధానం చెప్పగలుగుతానో.. తెలుసుకోవడానికే బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లానని చెప్పుకున్నారు. హేమ గతంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జైసమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నుంచి పోటీ చేశారు. కనీసం వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమెకు రాజకీయంగా అండగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే… ఇప్పుడు పరిస్థితి మారింది. ఆమె వైసీపీలో చేరి తన రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. అదే విషయాన్ని తన మాటల్లో వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close