అన్నింటికీ సచివాలయ వాలంటీర్లే – పారిశుద్ధ్య పనులకు కూడా !

పదిహేను వేల రూపాయల జీతానికి ఉద్యోగానికి తీసుకుని మూడేళ్ల పాటు వెట్టి చాకిరి చేయిచుకుని.. ఆనక కొత్త స్కేల్ తీసుకు వచ్చి అరకొర జీతాలతో రెగ్యులరైజ్ చేసిన సచివాలయ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి బానిసల్లా కనిపిస్తున్నారు. ఏ పనికి అవసరం అయినా వారినే పంపుతున్నారు.

కొన్నాళ్ల కిందట గుంటూరులో సులభ్‌ కాంప్లెక్స్‌ల కాంట్రాక్ట్ ముగియడంతో వాటి దగ్గర డబ్బులు వసూలు చేసే పనిని సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారు. అందులో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గగ్గోలు రేగే సరికి ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు వారికి అంత కంటే ఘోరమైన పనులు చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వానికి ఏ పని పడినా సచివాలయ ఉద్యోగులే గుర్తుకు వస్తున్నారు. అంగన్వాడీ ఆయాలు సమ్మె చేస్తే వారి పనులు చేయలని హుకుం జారీ చేశారు. ఇప్పుడు పారిశుధ్ధ్య కార్మికులు సమ్మె చేస్తే వారి బాధ్యతలు అప్పగించేస్తున్నారు. విశాఖలో అదే పని చేస్తూ ఆదేశాలిచ్చారు.

సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికీ చాలా మందికి రెగ్యులరైజ్ చేయలేదు. కొన్ని వేల మందిని అలా వదిలేశారు. వేల కొద్దీ ఖాళీలు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రతి పనికి వాడేస్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులు కూడా తమ పనిని వీరిపైనే పడేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కళ్ల ముందు ఓటమి – వాస్తు మార్పులతో జగన్ ప్రయత్నం !

అభ్యర్థులను మార్చారు వర్కవుట్ అవలేదు. బస్సు యాత్ర పేరుతో తనను తాను మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వర్కవుట్ అవ్వలేదు.. ప్రజలు మార్పు చేయడానికి సిద్ధమయ్యారని స్పష్టత రావడంతో చివరి...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కదలిక… ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు..!?

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్తబ్దత నెలకొందని ప్రచారం జరుగుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ప్రధాన సూత్రధారి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్...

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close