కేరళకు సాయం చేయలేకపోయానని దుబాయ్ రాజు ఫీలవుతున్నాడా..?

కేరళకు దుబాయ్ ఆర్థిక సాయం ప్రకటించిందా.. లేదా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేంద్రం ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా రూ. 700 కోట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజు… అనుకున్నారు. ఆ మేరకు భారత్‌కు సమాచారం ఇచ్చారు. దుబాయ్ రాజుకు కృతజ్ఞతలు చెబుతూ మోడీ ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత… పరిస్థితి మారిపోయింది. కేంద్రం ఆ సాయాన్ని తిరస్కరిస్తామని ప్రకటించారు. ఈ లోపే… ఇండియాలో.. ఉండే దుబాయ్ రాయబారి మాత్రం అలాంటి సాయం ఏదీ తమ రాజు ప్రకటించలేదన్నారు. దీంతో మరో సారి వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి.

ఈ లోపే… యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తూమ్.. సాయం తీసుకోని భారత్ తీరుపై పరోక్షంగా చురకలు వేస్తూ ట్వీట్లు చేశారు. ఉర్దూలో చేసిన ఆ ట్వీట్లు.. బీజేపీకి సూటిగా తగిలేలా ఉన్నాయి. మంచి పరిపాలకుడు ఎలా ఉండాలన్న అంశాన్ని తన ట్వీట్లలో సూచించారు. కొందరు నాయకులు ప్రజాసంక్షేమం కోసం పని చేస్తారని, మరి కొందరు మాత్రం కేవలం చట్టాలకు పరిమితమై కొందరి జీవితాలకు విఘాతంగా మారుతారని ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్‌లో ఆయన నేతల గొప్ప తనాన్ని వర్ణించారు. ప్రజలకు సేవ చేసేందుకు మంచి నాయకుడు సంతోషంగా ముందుకు వస్తారని రాశారు. తన దగ్గర ఉన్నది అందరికీ ఇస్తాడని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తాడని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు. ఇక రెండవ ట్వీట్‌లో నేతల వైఖరిని విమర్శించారు. కొందరు నేతలు ప్రజల జీవితాలకు సమస్యగా మారుతారన్నారు. ప్రజలు తమ వెంటే ఉండాలన్న ఆశతో వాళ్లు ఉంటారన్నారు. అదే సంతోషంగా వాళ్లు భావిస్తారన్నారు. అయితే మొదటి తరహా నేతలు ఉంటేనే.. రాష్ర్టాలు, ప్రభుత్వాలు వర్ధిల్లుతాయని రషీద్ తన ట్వీట్‌లో తెలిపారు.

అయితే ఈ ట్వీట్ కచ్చితంగా… భారత్‌కు సంబంధించి చేసిందనే సూచలేవీ ఆ ట్వీట్‌లో లేవు. కానీ.. కేరళకు ఆర్థిక సాయం విషయం మాత్రం ఇటీవల బాగా హైలెట్ అయింది కాబట్టి… దాని గురించే అన్న చర్చ మాత్రం ప్రారంభమవుతుంది. దుబాయ్ లో ఉన్న వలస కార్మికుల్లో అరవై శాతం మంది కేరళ వాసులే. తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో కేరళ వాసుల పాత్ర ఉందన్న కృతజ్ఞతతో … దుబాయ్ రాజు విరాళం ప్రకటించాలనుకున్నారు. కానీ అది వివాదాలతో ఆగిపోయింది. అందుకే ఆయన అలా స్పందించారని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close