కేజ్రీవాల్‌కూ తెలంగాణలో చాన్స్ కనిపిస్తోంది !

తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ ఎక్కువగా ఉందని.. అందులో తమ పార్టీని చొప్పించేయాలనుకునే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. షర్మిల, ప్రవీణ్ కుమార్ వంటి వారే కాదు.. కొత్తగా పంజాబ్‌లో గెలిచిన ఆమ్ ఆద్మీ కూడా తెలంగాణపై కన్నేసింది. దక్షిణాదిలో పార్టీని విస్తరించుకోడానికి తెలంగాణలో అడుగు పెట్టాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతు ఆప్ కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సోమనాథ్ భారతి అనే ఆప్ సీనియర్ నేత దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన ఇప్పటికే పలువురు మాజీ బ్యూరో క్రాట్లను కలిసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి ఉంది. ఈ కారణంగా కేజ్రీవాల్ తెలంగాణపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి తెలంగాణలో ఆప్ లాంటి పార్టీలకు హైదరాబాద్‌లో మాత్రమే కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అసలు ఆప్ గురించి ఎవరికీ అవగాహన కూడా ఉండదు. పూర్తి స్థాయిలో లోకలైజేషన్ ఉన్న.. స్థానిక నినాదం పాతుకుపోయిన తెలంగాణలో .. హర్యానాకు చెందిన కేజ్రీవాల్ పెట్టి నఆమ్ ఆద్మీ నిలబడటం దాదాపుగా అసాధ్యమే. అయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఉన్న ఆమ్ ఆద్మీ… ఇక్కడ కొంత పోరాడుతున్న కాంగ్రెస్‌కు ఝులక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ రెడీ అవుతున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close