మహేశ్వరం రివ్యూ : తీగల కృష్ణారెడ్డి రేసులోనే ఉన్నారా..?

తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో తీగల కృష్ణారెడ్డి ఒకరు. గ్రేటర్ మేయర్‌గా టీడీపీ తరపున పని చేసిన ఆయన … తన జీవిత లక్ష్యంగా ఎమ్మెల్యే అవ్వాలని పట్టుబట్టి మరీ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి.. గత ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకున్నారు. 30వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేంలదరికీ టిక్కెట్లు కాన్సెప్ట్ లో భాగంగా కేసీఆర్ తీగలకూ టిక్కెట్ ఇచ్చారు. ఓ వైపు అసమ్మతి.. మరోవైపు ప్రజల నుంచి వ్యతిరేకత తీగలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తన అనుచరుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోతున్నారు.

ఇన్నాళ్లు టీఆర్‌ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా ఉన్న కొత్త మనోహర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి రెబల్‌గా పోటీచేస్తానని ప్రకటించారు. సొంత వ్యాపారాలను చక్కబెట్టుకోవడం, కాలేజ్‌లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం నుంచి రాబట్టుకునేందుకే ప్రయత్నించారు తప్ప.. మహేశ్వరం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న భావన ఉంది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగేందుకు వెళ్లిన తీగలకు నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తీగల తీరుతో విసుగుచెంది కాంగ్రెస్ లో చేరుతున్నారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ వైపు తీగలకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి తనదైన శైలితో ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో ఆమె చేసిన అభివృద్ధికి తోడు భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై ప్రజలకు ఆమె స్పష్టమైన హామీలను ఇస్తున్నారు.

టీఆర్ఎస్ క్యాడర్ కొత్త మనోహర్ రెడ్డి వైపు ఉంది. తీగలతో టీఆర్ఎస్‌లోకి వెళ్లిన టీడీపీ క్యాడర్ … కాంగ్రెస్‌లోకి వెళ్తోంది. దీంతో.. కొత్త మనోహన్ రెడ్డి.. హైకమండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మహేశ్వరం అభ్యర్థిని మారిస్తేనే టీఆర్‌ఎస్‌కు మేలు జరుగుతుందని, లేని పక్షంలో మహేశ్వరం అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ ఖాతాల్లో జమ కావడం ఖాయమని అంటున్నారు. చివరి క్షణంలో.. అయినా బీఫాం.. కేసీఆర్ కొత్త మనోహర్ రెడ్డికి ఇస్తారనే ఆశాభావంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close