ఇరాక్ లో ఐసిస్ ఉగ్రవాదుల దారుణం: రసాయన దాడి

ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి రష్యా దాని మిత్ర రాజ్యాలు, అగ్రరాజ్యాలు నెలల తరబడి వారి స్థావరాలపై ఎన్ని వైమానిక దాడులు చేస్తున్నా వారిని తుడిచిపెట్టలేకపోతున్నాయి. పైగా వారి వైమానిక దాడులకు ప్రతీకార చర్యలుగా ఐసిస్ ఉగ్రవాదులు నరరూప రాక్షసులులాగ తయారయ్యి సామాన్య పౌరులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు శనివారం ఉదయం ఇరాక్ లోని కిర్ కుక్ నగరంలోని తజా అనే చిన్న పట్టణంపై రెండు రసాయన బాంబులు ప్రయోగించారు.

తజా పట్టణ శివార్లలో కాపలా కాస్తున్న సమీర్ వైస్ అనే సెక్యూరిటీ గార్డు మూడేళ్ళ చిన్నారి పాప రసాయన దాడిలో అతి భయానకంగా మరణించింది. సుమారు 600 మంది పౌరులు గాయపడ్డారు. అనేక వందల మంది భయంతో పట్టణం విడిచి పారిపోయారు. ఆ చిన్నారిని అతను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించేడు కానీ ఫలితం లేకపోయింది. మొదట ఆమె రెండు కళ్ళు ఉబ్బిపోయాయి. తరువాత ఆమె చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం మొదలయింది. మరి కాసేపటికి ఆమె శరీరం నల్లగా మాడిపోయినట్లు తయారయింది. చాలా సేపు ఆ నరకం అనుభవించిన తరువాత పాప బాధతో విలవిలాడుతూ చనిపోయిందని సమీర్ వైస్ కన్నీళ్లు కార్చుతూ చెప్పాడు.

ఈ రసాయన దాడికి గురయినవారి శరీరంలో చాలా వేగంగా నీటి శాతం తగ్గిపోయి డీ హైడ్రేషన్ కి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు , కళ్ళు ఉబ్బి పోవడం, చర్మం కమిలిపోవడం వంటి లక్షణాలు కనబడ్డాయని వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు.

ఈ దాడి చేసిన వారిని ఉపేక్షించబోమని, వారికి తగిన విధంగా బుడ్డి చెప్పి తీరుతామని ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్-అబ్ది చెప్పారు. గాయపడిన వారిలో కొంతమంది ఆరోగ్యం చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

‘హీరామండి’ వెబ్ సిరిస్ రివ్యూ: నయనానందమే కానీ…

Heeramandi Web Series Review సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాలో పరిచయం అవసరం లేని దర్శకుడు. భారీదనం ఉట్టిపడే కళాత్మక చిత్రాలతో పేరుతెచ్చున ఆయన ఇప్పుడు వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close