వైసీపీకి పన్నెండేళ్లు ..ఆ ఉత్సాహం ఏది ?

వైసీపీ ఏర్పాటు చేసి పన్నెండేళ్లవుతోంది. 2011లో ఇదే రోజున జగన్ సోనియాగాంధీపై తిరుగుబాటు చేసి సొంత పార్టీ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత జగన్ పోరాట పటిమ ప్రదర్శించారు. జనంలోనే ఉన్నారు. నిజానికి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది. అయినప్పటికీ సానుభూతి కారణంగా ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఆయన హవా ఎక్కువగా ఉండేది. కానీ రాను రాను మొత్తం కరిగిపోయింది. చివరికి అది గెలుస్తామనుకున్న 2014 ఎన్నికల్లో ఓటమికి దారి తీసింది.

అయినా జగన్ వెనక్కి తగ్గకుండా జనంలోనే ఉండి.. పాదయాత్ర చేసి.. వారం వారం కోర్టుకెళ్లాల్సిన పరిస్థితుల్లోనూ తన పోరాటం కొనసాగించి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. టీడీపీ పాలనపై కుల ముద్ర వేసినా… పీకే వ్యూహాలతో చేసినా.. విజయం విజయమే కాబట్టి జగన్ అనుకున్నది సాధించారు. అప్పటి వరకూ వైసీపీలో ఓ రకమైన ఉత్సాహం ఉండేది. అధికారంలోకి వస్తామనే ఆశ కనిపిస్తూ ఉండేది. తీరా అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ వైసీపీలో అదే ఉత్సాహం ఉండేది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగరేసి స్వీట్లు పంచుకుని.. చంద్రబాబును , టీడీపీని విమర్శించి ఎవరి దారిన వాళ్లు పోవడం తప్ప.. ఇంకెలాంటి ఉత్సాహం కనిపించడం లేదు.

ఏ చిన్న పండుగ వచ్చినా జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు.. పోస్టర్లు.. పేపర్‌లో ప్రకటనలు వెల్లువెత్తేవి. అలాంటిది … ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నా ఎవరూ అలాంటి ఖర్చులు పెట్టుకోలేదు. వైసీపీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వారెవరూ ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఆర్థికంగా బలపడతామనుకున్న వారు ఇప్పుడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పెద్ద నేతలు.. మంత్రులు.. వ్యాపారవేత్తల నేతలు మాత్రం పెద్ద పెద్ద ఈవెంట్లు జరిగిప్పుడు ఖర్చు పెట్టుకుటున్నారు. ఈ పరిస్థితిపై వైసీపీ నేతలు సమీక్ష చేసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close