బీజేపీ కాకపోతే.. ఐటీ దాడులే..! కర్ణాటకలో సీన్ రిపీట్..!

రాజకీయ ప్రత్యర్థులపైనే రాజ్యాంగ సంస్థలను వాడుకుంటూ.. చేస్తున్న రాజకీయం… ఇతర పార్టీల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. ఏపీలో టీడీపీ అభ్యర్థులపై ఇప్పటికే గురి పెట్టిన ఐటీ అధికారులు.. కర్ణాటకలో… జేడీఎస్ నేతలపై అవే తరహాలో దాడులు ప్రారంభించారు. కర్నాటక మంత్రితో పాటు జేడీఎస్‌ నేతల ఇళ్లల్లో ఏక కాలంలో దాడులు చేయడంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మండిపడ్డాయి. కేంద్రం తీరును నిరసిస్తూ… బెంగళూరులోని ఐటీ ఆఫీసు ముందు సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆందోళనకు దిగారు. హసన్‌, మాండ్యా జిల్లాలోని దాదాపు 300 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జేడీఎస్‌కు చెందిన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లతో పాటు ప్రముఖుల ఇళ్లలపై దాడులు చేశారు.

కర్నాటక మంత్రి సీఎస్‌. పుట్టారాజుతో పాటు అతని మేనల్లుడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా.. సీఆర్పీఎఫ్‌ దళాలతో.. దాడులకు దిగడం.. చర్చనీయాంశం అయింది. హసన్‌, మాండ్యాలో మంత్రి రేవణ్ణ, సీఎం కుమారస్వామి కుమారులు పోటీ చేస్తున్నారు. మాండ్యా పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి నిఖిల్‌ కుమారస్వామి పోటీ చేస్తుండగా… హసన్‌లో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ బరిలోకి దిగారు. సోదాలపై తీవ్రంగా స్పందించింది కుమారస్వామి సర్కార్‌. ముఖ్యంగా కర్నాటక-గోవా ఐటీ డైరెక్టర్‌ బాలక్రిష్ణపై మండిపడ్డారు. బెంగళూరులోని ఐటీ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సీఎం కుమారస్వామితో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సిద్ధరామయ్యలు కూడా పాల్గొన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వతంత్ర సంస్థలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే… సీబీఐ విషయంలో మమత వ్యవహరించిన దారిలో వెళ్తామంటూ హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. ఇదే విధంగా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఒక్కరంటే.. ఒక్క బీజేపీ అభ్యర్థి జోలికి వెళ్లలేదు. కానీ.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య బస చేసిన హోటల్ గదిని కూడా వదిలి పెట్టలేదు. అంతగా.. ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇప్పుడు.. ఏపీలోనూ అదే చేస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ .. చివరికి ఈసీని కూడా బీజేపీ వాడేసుకుంటోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close