తమ్మినేని టిక్కెట్ చిరిగింది !

చంద్రబాబును ఆయన కుటుంబాన్ని ఎంత తిడితే జగన్ రెడ్డి అంతగా వీరతాళ్లు వేస్తారని..తన హోదాను కూడా .. రాజ్యాంగబద్దమైన పదవిని కూడా చులకన చేస్తూ…. విచ్చలవిడిగా నోటి విరోచనాలు చేసుకున్న తమ్మినేని సీతారాం టిక్కెట్ ను జగన్ రెడ్డి చించేశారు. ఆముదాల వలస నియోజకవర్గానికి మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు కుటుంబం నుంచి బొడ్డేపల్లి పద్మజ అనే మహిళను ఖరారు చేశారు. ఈ విషయం పై క్లారిటీ రావడంతో తమ్మినేని సీతారం ఆస్పత్రి పాలయ్యారు.

నిజానికి తమ్మినేని సీతారాం ఈ సారి తాను పోటీ చేయనని తన కుమారుడికి చాన్సివ్వాలని అడుగుతూ వస్తున్నారు. చూద్దాం అంటూ… చెబుతూ వస్తున్నారు సజ్జల. తమ్మినేని తన సీరియారిటీని గుర్తించి ఓ సారి మంత్రిని చేస్తే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనుకుంటూ వస్తున్నారు. రెండో సారి మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అసెంబ్లీలో ఆయన చేసిన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఓ సారి అచ్చెన్నాయుడుతో .. తాను మంత్రిని అయి కిందకు వచ్చి మీ సంగతి తేలుస్తానని సవాల్ కూడా చేశారు. కానీ జగన్ రెడ్డి పట్టించుకోలేదు.

ఇప్పుడు ఆయనకు.. ఆయన కుటుంబానికి కూడా టిక్కెట్ నిరాకరించి.. కొత్త వారసుల్ని తెరపైకి తెచ్చారు. దీంతో తమ్మినేని కుటుంబం రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని చెబుతున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటు గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసినా జగన్ రెడ్డి నైజం తెలుసు కాబట్టి దానిపైనా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తామని.. తర్వాత మంత్రిని చేస్తామని గతంలో ఆర్కే.. మర్రి రాజశేఖర్ వంటి వారికి ఇచ్చినట్లుగా హామీలు ఇవ్వొచ్చు కానీ.. అసెంబ్లీ టిక్కెట్టే ఇవ్వని జగన్.. మంత్రి పదవి ఇస్తారని నమ్మితే అంత కన్నా బకరా ఉండరన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close