ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా – గెలిపించినందుకా ఇంత కక్షా ?

జగన్ అధికారం చేపట్టిన తర్వాత తొలి రోజుల్లో సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. కలసి పని చేసుకుందాం.. కాల్లో ముల్లు గుచ్చుకున్నా తీస్తా.. మనందరి ప్రభుత్వం.. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత బాగా పని చేస్తారు అని తీయని మాటలు చెప్పారు. ఉద్యోగులు పొంగిపోయారు. ప్రయోజనాలు కల్పిస్తారు కదా అని ప్రభుత్వం చేసే అడ్డగోలు వ్యవహారాలకు మద్దతు పలికారు. కానీ నాలుగేళ్లు గడుస్తున్న సమయంలో ఇప్పుడేమయింది? ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనం నెర వేరకపోగా ఇప్పుడు .. పదో తరగతి పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు ఏర్పాటు చేసే ఫ్లయింగ్ స్క్వాడ్ తరహాలో స్క్వాడ్లను ఏర్పాటు చేసి ఉద్యోగులు పని చేస్తున్నారో లేదో చూస్తారట. ఈ ఆలోచన వింటేనే… ఉద్యోగులు హా.. హతవిథి అనుకోక తప్పదు.

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నారన్నది వారికి అర్థం కావడం లేదు. గత ప్రభుత్వం ఎంత మేలు చేసినా.. అత్యధిక మంది ఉద్యోగులు జగన్ కే సపోర్ట్ చేశారు. ఆ విషయం పోస్టల్ బ్యాలెట్లలో వచ్చిన ఆధిక్యంలోనే స్పష్టంగా తెలుస్తోంది. అలాంటి ఉద్యోగుల పట్ల జగన్ సానుకూలంగా వ్యవహరించాల్సి ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంది. కానీ హామీలను ఏ మాత్రం అమలు చేయకపోగా.. వారి పీఆర్సీని నియంత్రించారు. డీఎల విషయంలో మోసం చేస్తున్నారు. జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. వారు దాచుకున్న డబ్బులనూ ఇవ్వడం లేదు.

గతంలో చంద్రబాబు హయాంలో పంచ్ సిస్టం తీసుకు వస్తేనే ఉద్యోగులు రగిలిపోయారు. కానీ ఇప్పుడు ముఖ హాజరు తీసుకు వచ్చారు. చివరికి ఉద్యోగులు పనిచేస్తున్నారో లేదో నిగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పని చేయని ఉద్యోగుల్ని పట్టుకుంటారట. ప్రభుత్వ తీరు చూసి.. కాలికి అంటుకున్నది ముక్కుకు అంటించుకున్నట్లుగా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారంటే.. అదంతా వారి తప్పిదమే. చంద్రబాబు చేసే అడ్మినిస్ట్రేషన్ కు.. జగన్ చేసే పాలనకు తేడా ఇప్పటికి ఉద్యోగులకు కనిపిస్తోంది.

అయితే ఉద్యోగులకు అర్థం కాని విషయం ఏమిటంటే.. తాము ఇంతగా సపోర్ట్ చేసినా.. జగన్ తమను ఎందుకు వేధిస్తున్నారనేదే ?. అయితే యాభై శాతం ఓట్లేసిన జనాలను కూడా జగన్ అలాగే వేధిస్తున్నారని.. అందిరకీ అదే డౌట్ ఉందని… ఉద్యోగులకు మాత్రమే కాదన్న సెటైర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close