జగన్‌ రాజశ్యామల పూజలు ..! ఇంత హఠాత్తుగా ఎందుకో..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శారదా పీఠానికి వెళ్తున్నారు. అక్కడ రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ రాజశ్యామల ఆలయం….పూజలు..హోమాలు.. అధికారం సుస్థిరం చేసుకునేందుకు చేస్తారని.. తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో.. కేసీఆర్ .. అదే శారదాపీఠానికి చెందిన స్వరూపానందతో… యాగం చేయించుకున్నాకే బయట ప్రపంచానికి తెలిసింది. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో … ఆ యాగం పూర్తి చేసి.. ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఘన విజయం సాధించారు. తరవాత జగన్మోహన్ రెడ్డి కూడా… ఎన్నికలకు ముందు.. రాజశ్యామల యాగం చేశారు. యాగఫలాలో.. లేక… సహజంగానే ఫలితాలు వచ్చాయో కానీ… వారికి మంచే జరిగింది.

దాంతో… ముఖ్యమంత్రులకు స్వరూపానందపై గురి కుదిరింది. జగన్మోహన్ రెడ్డి.. మరింత నమ్మకం పెంచుకున్నారన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. దీనికి కారణం… విశాఖకు రాజధాని మార్పు నిర్ణయం వెనుక ప్రధాన కారణం… స్వరూపానంద సలహాలేనని .. టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇరవై మూడో తేదీ లోపు… రాజధానిని తరలించకపోతే.. ఏలిన నాటి శని పట్టుకుంటుందని చెప్పారని.. అందుకే జగన్ హడావుడి చేస్తున్నరని… దేవినేని ఉమ లాంటి నేతలు బహిరంగ విమర్శలు చేశారు. అయితే.. 23వ తేదీలోపు తరలించలేకపోయారు. ఫలితంగా… ఇప్పుడు ఆయన శాంతి పూజలు చేయాలనుకుంటున్నారని.. ఈ మేరకు స్వరూపానంద సలహా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ కారణంతోనే జగన్.. స్వరూపానంద ఆశ్రమంలో రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి… స్వరూపానంద ఆశ్రమంలో రెండు, మూడు గంటలు ఉంటారని అంటున్నారు. కోర్టుకు హాజరవకుండా.. రాష్ట్రాభివృద్ధి కోసం.. ప్రతి క్షణం కష్టపడుతున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి … పూజల కోసం.. మాత్రం… ఎలాంటి వారెంట్లు లేకపోయినా తీరిక చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close