సాఫీగా టీడీపీ, జనసేన రాజకీయాలు – పక్కా ప్లాన్ !

పొత్తులు ప్రకటించారు పవన్. టీడీపీ కూడా సమన్వయంతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరికైనా పొత్తులపై అభ్యంతరాలు ఉంటే.. తమ దారి తాము చూసుకోవచ్చని గతంలోనే చెప్పారు. తన నిర్ణయమే ఫైనల్ అని… తేల్చేశారు. ఇప్పుడు మరోసారి అదే సందేశం పంపే అవకాశం ఉంది. జగన్ రెడ్డి … వందల కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో చిచ్చు పెడతారని.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లంతా అలాంటి కోవర్టులేనని జనసేన అభిప్రాయం.

మరో వైపు సీట్ల గురించి ఎవరూ మాట్లాడవద్దని.. పార్టీకి ఎక్కడ బలం ఉందో అక్కడ ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని.. ఈ విషయంలో బయట లేనిపోని చర్చలు పెడితే ఊరుకునేది లేదని పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు అంశం తాము చూసుకుంటామని చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశం… ప్రభుత్వంపై పోరాటం. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. నిర్బంధాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజా ఉద్యమం బలంగా లేపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీతో కలిసి ఓ తిరుగుబాటును ప్రజ్లలోకి తీసుకు వచ్చి ప్రభుత్వంపై విప్లవం మాదిరిగా పోరాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందు కోసం టీడీపీతో కలిసి సమన్వయంతో కలిసి పని చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పవన్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close