ఆసేతుహిమాచలం ఘన నీరాజనం: ఢిల్లీ చేరుకున్న పార్థివదేహం

హైదరాబాద్: నిన్న షిల్లాంగ్‌లో కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు జాతిమొత్తం ఘనంగా నివాళులర్పిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారివరకు కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా దేశప్రజలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కలామ్‌ బోధనలను, రచనలను, స్ఫూర్తిని తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు ఆయన పార్థివదేహం ఈ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ప్రత్యేకవిమానంలో గౌహతినుంచి ఢిల్లీ చేరుకుంది. జాతీయ పతాకంతో కప్పిఉన్న కలామ్ భౌతికకాయాన్ని, ప్రముఖులు నివాళులు అర్పించటానికి వీలుగా పాలం విమానాశ్రయంలోనే ఒక వేదికపై ఉంచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణమంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌‍నాథ్‌‍సింగ్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. ఇక్కడనుంచి మృతదేహాన్ని రాజాజీమార్గ్‌లో ఉన్న కలామ్ నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఈ సాయంత్రంవరకు భౌతికకాయాన్ని అక్కడే ఉంచుతారు. అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి. కుటుంబ సభ్యుల అభ్యర్థనమేరకు కలామ్ అంత్యక్రియలను రేపు రామేశ్వరంలోనే జరపాలని కేంద్రప్రభుత్వం ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close