రజనీ మిడిల్ డ్రాప్ అయినా కమల్ మాత్రం ఆగరట..!

రజనీకాంత్ ఆరోగ్య కారణాలతో పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మిడిల్ డ్రాప్ ప్రకటించినప్పటికీ..  మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ మాత్రం వెనక్కి తగ్గదల్చుకోలేదు. తాను ప్రారంభించిన పార్టీకి ప్రస్తుతం గొప్ప ఆదరణ లేదని లోక్‌సభ ఎన్నికల్లో తేలింది. అయితే కమల్ హాసన్ మాత్రం.. డోంట్ గివ్ అప్ అనుకుంటున్నారు. తన పార్టీ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్త చేస్తున్నారు. అసెంబ్లీలో తన గొంతుని బలంగా వినిపిస్తానని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా మక్కల్‌ నీది మయ్యంని కమల్ చెబుతున్నారు. 

అయితే.. తన బలంపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే… కూటమి కట్టాలనే ఆలోచనకు వచ్చారు. థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నానని ప్రకటించారు. రజినీకాంత్ పార్టీ పెట్టినా, పెట్టకపోయినా మద్దతు కోరుతానని.. ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.  డీఎంకేతో కూటమిలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపైా స్పందించారు. ఎలాంటి చర్చలు జరగడం లేదని తేల్చేశారు. నవంబర్‌లో తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని .. ఇక పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తానని అంటున్నారు. కమల్ భావజాలంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. 

అయినా ఇటీవలి కాలంలో ఆయన బీజేపీతో కలుస్తారన్న ప్రచారం జరిగింది. తమిళనాడులో బీజేపీకి జవసత్వాలు కల్పించేందుకు ఓ ప్రముఖ నేత కోసం ఆ పార్టీ చూస్తోంది. దాంతో చాలామందిపై రూమర్స్ వస్తున్నాయి. కానీ ఎవరూ బీజేపీ వైపు చూడటం లేదు. అక్కడే సమస్య వస్తోంది. కమల్ మాత్రం.. బీజేపీతో పొత్తు కానీ.. ఇతర బంధం కానీ పెట్టుకునే అవకాశం లేదని చెబుతున్నారు. ఆయన చివరికి డీఎంకే కూటమిలో చేరే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close