కృష్ణ మెమోరియ‌ల్‌…మాటిచ్చిన కేసీఆర్‌, జ‌గ‌న్‌

సూప‌ర్ స్టార్ కృష్ణ అంత్య‌క్రియ‌లు హైద‌రాబాద్ లోని మ‌హాప్ర‌స్థానంలో అని తెలిసిన ద‌గ్గ‌ర్నుంచి అంద‌రి నోటా… ఒక‌టే చ‌ర్చ‌.. కృష్ణ మెమోరియ‌ల్ ఎక్క‌డ ఏర్పాటు చేస్తార‌ని? సాధార‌ణంగా సినీ తార‌లు చ‌నిపోయిన‌ప్పుడు వాళ్ల అంతిమ సంస్కారాల‌న్ని ప్రైవేటు ఫామ్ హౌస్‌ల‌లో నిర్వ‌హిస్తుంటారు. ఎందుకంటే… ఆ స‌మాధి చుట్టుప‌క్క‌ల ప్రాంతం ఓ జ్ఞాప‌కంగా మిగిలిపోవాల‌ని. కానీ.. కృష్ణ అంత్య క్రియ‌లు మాత్రం మ‌హాప్ర‌స్థానంలో జ‌రిగిపోయాయి. దాంతో.. కృష్ణ స్మార‌క చిహ్నం ఉంటుందా, లేదా? అనే అనుమానాలు త‌లెత్తాయి. అయితే వీటికి సంబంధించిన ఏర్పాట్లు, వాటి ప్ర‌ణాళిక‌ల‌పై.. కృష్ణ కుటుంబం ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు టాక్‌. హైద‌రాబాద్ లోని ప‌ద్మాల‌యా స్టూడియోస్‌లో.. కృష్ణ స్మార‌క చిహ్నం ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. మ‌రోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌లు కూడా… త‌మ వంతు సాయం చేస్తామ‌ని మాట ఇచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని కృష్ణ సోద‌రుడు ఆది శేష‌గిరిరావు ప్ర‌స్తావించ‌డం విశేషం. కృష్ణ‌ను ఏపీ, తెలంగాణ అంటూ వేరు చేయ‌లేం. తెలుగువారి అభిమాన పాత్రుడు కృష్ణ‌. అందుకే రెండు ప్ర‌భుత్వాలూ స‌రైన రీతిలో గౌర‌వించాల‌ని భావిస్తున్నాయి. తెలంగాణ‌లో కృష్ణ స్మార‌క చిహ్నం ఏర్పాటుకు కొంత భూమి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఏపీ వ‌ర‌కూ వ‌స్తే.. కృష్ణ స్వ‌గ్రామం బుర్రిపాలెంలో ప్ర‌భుత్వం స్థ‌లం కేటాయించే అవ‌కాశం ఉంది. రెండు చోట్లా.. సూప‌ర్ స్టార్ కు గుర్తుగా స్మారక చిహ్నాలు ఏర్పాటు చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. రెండు చోట్లా.. కృష్ణ కాంస్య విగ్ర‌హాల్ని, లేదా మైన‌పు విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించేలా ఆలోచిస్తున్నామ‌ని ఆదిశేష‌గిరిరావు తెలిపారు. అంతేకాదు.. ఓ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు జ‌ర‌పాల‌ని, అందుకోసం ఓ నిధిని ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close