జగన్ రెడ్డి ఇజ్జత్ తీసిన కేసీఆర్ – తుడిచేసుకుంటారుగా !?

బీఆర్ఎస్ పార్టీ అంటే వైసీపీ నేతలు భయభక్తులు ప్రదర్శిస్తారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు జగన్ రెడ్డి పరువు తీస్తూనే ఉంటారు. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కూడా అదే చేశారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన జగన్ రెడ్డి పాలనా ఎంత గొప్పగా ఉందో.. అక్కడి పరిస్థితుల్ని తెలంగాణతో పోల్చి కామెడీ చేసి జగన్ రెడ్డి ఇజ్జత్ తీశారు. డబుల్ రోడ్లు ఉంటే తెలంగాణ .. సింగిల్ రోడ్ ఉంటే ఏపీ అని కేసీఆర్ తేల్చేశారు. ఏపీలో రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా నిర్మించలేదని కేసీఆర్ చెప్పేశారు. సమయంలో ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి.

అలాగే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పాలన రాదని.. హేళన చేశారని కానీ ఇప్పుడు ఏపీ నుంచి రైతులు తెలంగాణ కు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. తెలంగాణలో ధాన్యం అమ్ముకునేందుకు ఏపీ రైతులు వస్తన్నారని అక్కడి ప్రభుత్వం సరిగ్గా ధాన్యం సేకరణ చేయడం లేదని కేసీఆర్ చెప్పినట్లయింది. అదే సమయంలో విద్యుత్ అంశంపైనా స్పందించారు. తెలంగాణలో కరెంట్ పోదన్నారు. రాష్ట్రం విడిపోతే.. తెలంగాణ చీకటి అవుతుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకుని చూపించారన్నారు. కానీ ఇప్పుడు ఏపీలో చిమ్మ చీకట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీలో కరెంట్ కోతలపై తెలంగాణ నేతలు వెసే సెటైర్లకు కొరతేమీ ఉండదు. మోటార్లకు మీటర్లు పెడితే పెద్ద ఎత్తున నిధులు ఇస్తామన్నారని..కానీ అలా పెట్టేది లేదని చెప్పామన్నారు. పాతిక వేల కోట్లు నష్టం వచ్చినా సరే మీటర్లు .. రైతుల మోటార్లకు పెట్టేది లేదన్నారు.

ఏపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి అప్పులు , అదనపు సాయం తెచ్చుకుంది. హరీష్ రావు ఎన్నో సార్లు రైతుల మెడకు జగన్ ఉరేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ రాకపోతే అమరావతి లాగే హైదరాబాద్ అవుతుందని హెచ్చరించారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. కేటీఆర్ ఓ సారి.. ఏపీని నరకంతో పోల్చారు. అప్పట్లో వివాదాస్పదమయింది.

నిజానికి బీఆర్ఎస్ తో ఏపీ అధికార పార్ట పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా రెండు పార్టీలు సహకరించుకుంటూ ఉంటాయి. బీఆర్ఎస్ పై .. వైసీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయరు కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం.. తరచూ తమ పాలన ఎంత గొప్పగా ఉందో చెప్పుకోవడానికి ఏపీ పరిస్థితుల్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. అయినా వైసీపీ నేతలకు పెద్దగా ఫరక్ పడదు. తుడిపేసుకుని వెళ్లిపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close