ఆర్కే పలుకు : “ఆంధ్రా బూచి” చూపడానికే కేసీఆర్ కొత్త నాటకం !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో ఈ సారి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కన్నా కేసీఆర్‌ రాజకీయాన్ని విశ్లేషించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. హుజురాబాద్‌లో పోటీ జరిగింది ఈటల రాజేందర్‌కు – గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మధ్య కాదని .. కేసీఆర్‌కు ఈటలకు మధ్య అని కేసీఆర్ ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినా ఆయన రాజకీయం అంతమైపోయినట్లేనని విశ్లేషించారు. ఈ విషయంపై కేసీఆర్‌కు స్పష్టత ఉంది కాబట్టే.. మిత్రుడు జగన్‌తో కలిసి కొత్తగా సమైక్య రాష్ట్ర నినాదం ప్రారంభించారని అంటున్నారు.

సమయం, సందర్భం లేకుండా ప్లీనరీని పెట్టిన కేసీఆర్ అందులో ఆంధ్రాలో రాజకీయపార్టీ గురించి ప్రస్తావించారు. తనకు వేల ఫోన్లు వస్తున్నాయన్నారు. ఆంధ్రాలోని ఇతర సమస్యలను ఆయన ఎగతాళి చేసినా వాటిపై స్పందించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ..ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టడంపై మాత్రం స్పందించారు. తెలంగాణ, ఏపీని కలిపేస్తే బెటర్ అని చర్చ లేవనెత్తారు. వారు అలా మాటల తర్వాత తెలంగాణ రాజకీయం ప్రారంభమయింది. మళ్లీ ఆంధ్రోళ్ల కుట్రలంటూ టీఆర్ఎస్ అధికారిక మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి. ఇవే అంశాలను తన కొత్తపలుకులో వివరించిన ఆర్కే.. వ్యూహాత్మకంగానే ఇద్దరు మిత్రులు ప్రచారం ప్రారంభించేశారని చెప్పకనే చెప్పారు.

గత ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు పెత్తనం వస్తుందన్న ప్రచారంతోనే ఎన్నికల్లో గెలిచి పీఠం అందుకున్న కేసీఆర్.. ఈ సారి కూడా తనపై ఉన్న అసంతృప్తిని ఆంధ్రోళ్ల పెత్తనం అనే కాన్సెప్ట్‌తో అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ పనిలో భాగంగానే ఇప్పుడు సమైక్య రాష్ట్రం అనే చర్చ ప్రారంభమయిందని ఆర్కే చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజం అని సామాన్యులు కూడా అనుకునే పరిస్థితి.

హుజురాబాద్‌లో ఉపఎన్నిక రావడం.. అటు ఈటల – ఇటు కేసీఆర్ ఇద్దరూ చేసుకున్న రాజకీయమేనని.. కానీ ఫలితం మాత్రం కేసీఆర్‌కు గుదిబండగా మారడం ఖాయమని చెబుతున్నారు. అంతే కాదు .. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాజకీయాల్ని ఖరీదు చేసేశారని కేసీఆర్‌పై మండిపడ్డారు. మొత్తానికి ఈ వారం ఆర్టికల్‌లో సాగునీటి ప్రాజెక్టుల్ని మూలన పడేసి మరీ ..తమ తమ రాజకీయాల కోసం రాష్ట్రాలను సైతం ముఖ్యమంత్రులు భ్రష్టుపట్టిస్తున్నారని ఆర్కే తేల్చారు. వారి రాజకీయానికి ఏపీ ప్రజలు ఎలా పోయినా మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు తేవడానికి ప్రయత్నిస్తున్నారని తేల్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close