తెలంగాణ సర్కార్‌కు రుణమాఫీ కూడా గుర్తొచ్చింది..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. రెండో సారి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇంత వరకూ కీలకమైన హామీలను అమలు చేయలేదు. రుణమాఫీ నుంచి… నిరుద్యోగ భృతి వరకూ చాలా హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని అమలు చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతుందన్న ఆందోళనతో ఉన్న కేసీఆర్.. హామీలను అమలు చేసే ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరోనా వైరస్ వల్ల రుణమాఫీ ఆలస్యమైందని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

మరో వైపు.. గతంలో ప్రభుత్వానికి బాగా ఓట్లు తెచ్చి పెట్టిన పథకాల్లో ఒకటి.. గొర్రెల పంపిణీ. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం… డిపాజిట్లు తీసుకున్న అధికారులు.. చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. ఒకటి.. రెండు సార్లు.. లబ్దిదారులు ప్రగతి భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ పథకం అమలు సరిగ్గా లేకపోవడంతో గొల్ల కురుమలు అసంతృప్తితో ఉన్నారని అంనచా వేసిన కేసీఆర్… పథకం అమలుపై దృష్టి పెట్టారు. ఈ పథకం కూడా కరోనా వల్ల నిలిచిపోయిందని.. వెంటనే గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 75 శాతం రాయితీ రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టాలన్నారు. ఇప్పటికే.. ఉద్యోగులకు పీఆర్సీ సహా అనేక తాయిలాలు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీని ప్రకటించారు. పథకాలనూ అమలు చేయడానికి సంకల్పించారు. అయితే.. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమైతే.. ప్రజల్లో మరింత అసంతృప్తి పెరిగిపోతుంది. అందుకే కేసీఆర్.. అన్నింటినీ పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close