“నేషనల్ మీడియా”లో కేసీఆర్ ప్రకటనల హోరు !

హిందీ, ఇంగ్లిష్ మీడియాలో ఇప్పుడు తెలంగాణ సాధించిన అభివృద్ధిపై డాక్యుమెంటరీల మీద డాక్యుమెంటరీలు ప్రదర్శితమవుతున్నాయి. ఎక్కడనుంచి ప్రారంభించిది.. ఎలా ఎదిగి అనేది వివరంగా చూపిస్తున్నారు. ఇందులో ప్రతి మాటలోనూ.. ప్రతి సీన్‌లోనూ కనిపించేది కేసీఆర్ పాలనా దక్షతే. కేసీఆర్ పాలనలో తెలంగాణ అత్యంత దిగువ స్థాయి నుంచి అమెరికా స్థాయిలో ఎదిగిందని చెబుతున్నారు. కానీ దేశం అలా ఎందుకు ఎదగలేకపోయిందని ఆలోచించాలన్నట్లుగా ఆ డాక్యుమెంటరీలో ఉంటున్నాయి.

హిందీ చానళ్లలోనూ ఎయిర్ టైమ్ కొని మరీ వీటిని ప్రసారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ పబ్లిసిటీ సాగుతూడటంతో నార్త్‌లోనూ చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ ప్రగతి గురించి కేసీఆర్ ఉత్తరాదిలో చెప్పాల్సిన అవసరం ఏమిటనేది ఆ చర్చ. దానికి కారణం కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజకీయ ప్రకటనలే అని చాలా మందికి అర్థం కావడం లేదు. తెలంగాణలో తాను ఏం చేశానో చెప్పిన తర్వాత కేసీఆర్ నార్త్ లో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల ప్లీనరీలో జాతీయ రాజకీయానికి కావాల్సినంత డబ్బులు కూడా సమీకరించానని ప్రకటించారు.

అందుకే ప్రకటనలు పెద్ద ఎత్తున ఇస్తున్నారని అంటున్నారు. అయితే ఇలాంటి ప్రచారంతోనే కేసీఆర్ ఉత్తారదికి నాయకుడిగా వెళ్లగలరా అన్నది డౌటే. ఇటీవల కేసీఆర్ చాలా రాష్ట్రాలకు వెళ్లారు. వెళ్లిన చోటల్లా.. దేశ్ కీ నేత అనే ప్రచారం చేసుకున్నారు. ఆయన ప్రయత్నం ఈ ప్రచార వ్యూహంతో అయినా ఫలిస్తుందో లేదో.. రెండు, మూడు నెలల్లో తేలిపోయే అవకాశం ఉంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close