అమరావతిలో జగన్, కేసీఆర్ భేటీకి ముహుర్తం ఫిక్స్..!

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్… విజయవాడ వెళ్లి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబును విమర్శిస్తానని చాలెంజ్ చేశారు. దాని ప్రకారం… ఇప్పుడు అన్నీ కలసి వచ్చాయి. తేదీ కూడా ఖరారయింది. ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన కొత్త మిత్రుడు… వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి.. ఆయన… విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ తదుపరి చర్చలు.. అమరావతిలో జరపాలని నిర్ణయించుకున్న జగన్, కేసీఆర్.. అందుకో సందర్భాన్ని ఎంచుకున్నారు. అమరావతిలో వైఎస్ జగన్ నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన జరగనుంది. ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ హాజరు కానున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయి. తమ ఉమ్మడి ఎజెండా చంద్రబాబు కాబట్టి… ఆ తర్వాత రాజకీయం కూడా అటు వైపే సాగుతుంది.

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ప్రకటన జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఆకర్షించింది. కేసీఆర్ తన వ్యూహాలతో.. చంద్రబాబును ఓడించగలరన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో ఏర్పడింది. అందుకే కేసీఆర్ లో ఓ హీరోని చూస్తున్నారన్న భావన ఏర్పడింది. టీఆర్ఎస్ ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయదు కాబట్టి…. చంద్రబాబును ఓడిస్తే లాభపడేది తనే కాబట్టి… ఆ క్రమంలో టీఆర్ఎస్ కు జగన్ బాగా దగ్గరవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్… చంద్రబాబును యాగానికి ఆహ్వానించేందుకు ఓ సారి, విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మరోసారి కేసీఆర్ రెండు సార్లు అమరావతి వచ్చారు. కానీ రాజకీయం కోసం రాలేదు. తొలి సారి రాజకీయం కోసం… అమరావతి రాబోతున్నారు. అయితే ఈ పర్యటనలో వస్తున్న స్పష్టమైన మార్పు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రావడం.

కేసీఆర్ అమరావతి పర్యటన కచ్చితంగా.. రాజకీయాల్ని మలుపు తిప్పే వ్యవహారమే అవుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని మరింతగా రాజకీయం చేయకుండా ఉండదు. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటో వైసీపీ శ్రేణులకూ అంతుబట్టడం లేదు. టీఆర్ఎస్ అధినేతను భుజాలపై మోయడం వల్ల… ఇప్పటికిప్పుడు.. తమ పార్టీకి వచ్చే లాభమేమిటో వారు అంచనా వేయలేకపోతున్నారు. కానీ జగన్ మాత్రం.. ఎవరి మాటల్ని వినే పరిస్థితులో లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close